Health

పురుషులు ఈ ఆరోగ్యపరీక్షలు సంవత్సరానికి ఒకోసారి ఖచ్చితంగా చేయించుకోవాలి. లేదంటే..?

కౌమారం, నవ యవ్వనంలో ఉన్నప్పుడు మనం ఎంతో శక్తివంతంగా ఉంటాం. చక్కగా ఆటలు ఆడతాం. కొండలెక్కుతాం. ప్రయాణాలు చేస్తాం. బిరియానీలు, కూల్‌ డ్రింకులు, జంక్ ఫుడ్ అనే తేడా లేకుండా దేన్నిబడితే దాన్ని తినేస్తాం. అయినా మనకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. మనలో జీవక్రియ సవ్యంగా కొనసాగుతుండటమే అందుకు కారణం. అందుకే మనం అప్పుడు ఎలాంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలూ లేకుండా దృఢంగా ఉంటాం. అయితే ఆరోగ్యం మీద అమ్మాయిలకు ఉన్నంత శ్రద్ధ అబ్బాయిలకు ఉండదు. జలుబు, జ్వరం వచ్చినా అస్సలు పట్టించుకోరు. కనీసం ట్యాబ్‌లెట్‌ కూడా వేసుకోరు. అదే అమ్మాయిలు అయితే.. అల్లాడిపోతారు. మాత్రలు వేసుకుంటారు, కాలేజ్‌కు సెలవు పెట్టేస్తారు, జాబ్‌ చేసేవాళ్లు అయితే.. సిక్‌ లీవ్‌ కూడా పెట్టేస్తారు.

అదే పురుషుల విషయానికి వస్తే..ఆ జలుబు ఎక్కువై మరీ ఇబ్బందిపెడితే అప్పుడు చికిత్స మొదలుపెడతారు. పురుషులు కచ్చితంగా కొన్ని పరీక్షలు సంవత్సరానికి ఒకసారి చేయించుకోవాలి. ఆరోగ్యం బాగున్నా లేకున్నా ఈ పరీక్షలు చేయించుకోవాలట.. పురుషులకు ముఖ్యమైన వైద్య పరీక్షలు.. రక్త పరీక్ష చాలా ముఖ్యం :- తరచుగా దాహం, దురద, అధిక మూత్రవిసర్జన, బలహీనమైన అవయవాలు పురుషులలో మధుమేహం యొక్క లక్షణాలు కావచ్చు. అధిక సంఖ్యలో భారతీయ పురుషులు ప్రీ-డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. అందుకే అప్పుడప్పుడు డయబెటిక్‌ పరీక్ష చేయించుకోవాలి. చాలా మంది వయసు చిన్నదనీ, రక్త పరీక్ష అవసరం లేదని అనుకుంటారు. కానీ చిన్న వయసులోనే మధుమేహం సర్వసాధారణం. కాబట్టి 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్య పురుషులు కూడా రక్త పరీక్ష చేయించుకోవాలి.

ఆరోగ్యవంతమైన పురుషులు కనీసం రెండేళ్లకు ఒకసారి రక్త పరీక్ష చేయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. 40 నుండి 65 సంవత్సరాల వయస్సు గల ఆరోగ్యకరమైన పురుషులు సంవత్సరానికి రెండుసార్లు రక్త పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం. రక్తపోటు పరీక్ష :- పురుషుల్లో గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దీనికి ప్రధాన కారణం అధిక రక్తపోటు. అధిక రక్తపోటు కూడా స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ రోజుల్లో అధిక రక్తపోటు కారణంగా చాలా మంది చిన్న వయస్సులోనే మరణిస్తున్నారు. 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్య ఆరోగ్యంగా ఉన్న పురుషులు రెండు సంవత్సరాలకు ఒకసారి రక్తపోటు పరీక్ష చేయించుకోవాలి.

40 నుంచి 65 ఏళ్లలోపు ఆరోగ్యవంతమైన పురుషులు సంవత్సరానికి రెండుసార్లు తమ రక్తపోటును తనిఖీ చేసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ప్రోస్టేట్ క్యాన్సర్ టెస్ట్ :- పురుషులలో మరణానికి ప్రధాన కారణాలలో ప్రోస్టేట్ క్యాన్సర్ ఒకటి. సకాలంలో చికిత్స పొందడానికి పురుషులు PSA వైద్య పరీక్ష చేయించుకోవాలి. క్యాన్సర్‌ని గుర్తించే రక్త పరీక్ష ఇది. 18 నుంచి 40 సంవత్సరాల వయస్సు గల ఆరోగ్యకరమైన పురుషులు నాలుగు నుండి ఐదు సంవత్సరాలకు ఒకసారి చేయాలి. 40 నుండి 65 సంవత్సరాల వయస్సు గల ఆరోగ్యకరమైన పురుషులు ప్రతి రెండు నుండి మూడు సంవత్సరాలకు ఒకసారి పరీక్షించ చేయించాలి. వృషణ క్యాన్సర్ స్క్రీనింగ్ :- ఈ క్యాన్సర్ ప్రమాదం 20 నుంచి 39 సంవత్సరాల వయస్సు గల పురుషులలో ఎక్కువగా ఉంటుంది.

వృషణాలను కూడా పరీక్షించవచ్చు. 18 నుండి 40 సంవత్సరాల వయస్సు గల ఆరోగ్యవంతులైన పురుషులు నెలకు ఒకసారి, 40 నుండి 65 సంవత్సరాల వయస్సు గల ఆరోగ్యవంతులైన పురుషులు ఐదు నెలలకోసారి ఈ పరీక్ష చేయించుకోవాలి. HIV పరీక్ష :- AIDS ఒక ప్రాణాంతకమైన లైంగికంగా సంక్రమించే వ్యాధి. చాలా మంది ఈ వ్యాధి సంభోగం తర్వాత వస్తుందని నమ్ముతారు. అయితే ఈ వ్యాధి సంభోగం వల్ల మాత్రమే వచ్చేది కాదు. కొన్నిసార్లు ఉపయోగించిన సూదులు ఉపయోగించడం ద్వారా వ్యాధి వ్యాపిస్తుంది. కాబట్టి పరీక్ష తప్పనిసరి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker