News

శుభవార్త చెప్పిన మోదీ, మహిళల అకౌంట్లోకి రూ.3 లక్షలు.

కేంద్ర ప్రభుత్వం..మహిళలకు కూడా ఎన్నో రకాల పథకాలను ప్రవేశపెడుతోంది. దీనిలో భాగంగా తాజాగా వారి కోసం మరో పథకాన్ని తీసుకొచ్చింది. దాని పేరు ఉద్యోగిని యోజన పథకం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఈ పథకం వ్యాపారం చేయాలనుకునే మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. వ్యాపార పెట్టుబడికి సంబంధించి లోన్ బ్యాంక్ అందజేస్తుంది. దాదాపు రూ.3 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. పూర్తీ వివరాలోకి వెళ్తే మధ్యకాలంలో వ్యాపార రంగంలోని మహిళలదే పై చేయి.

ఇలా వ్యాపారం చేసుకొనే వారికి ఆర్థిక సాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. అదేమిటంటే.. వ్యాపారం చేయాలనుకునే మహిళలకు ‘ఉద్యోగిని యోజన’ కింద బ్యాంకులో లోన్ తీసుకోవచ్చు. అయితే ఈ పథకంలో ప్రభుత్వం 30 శాతం వరకు సబ్సిడీని అందిస్తుంది. పైగా ఈ పథకం కింద గరిష్టంగా రూ.3 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. అయితే ఈ పథకానికి అర్హులు అయిన మహిళల వయసు కనీసం 18 నుంచి 55 ఏళ్ల మధ్య వరకు ఉండాలి.

అలాగే బ్యాంకు రుణానికి వారు ఎలాంటి హామీ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ, ఈ పథకం ప్రయోజనాలను పొందేందుకు కొన్ని షరతులు ఉన్నాయి. ఒక మహిళ కుటుంబ ఆదాయం కనీసం రూ.1.5 లక్షలు కానీ అంతకంటే తక్కువై ఉండాలి. అలాగే ఇందులో వితంతువులు, వికలాంగులు అయిన మహిళలకు మాత్రం ఆదాయ పరిమితి లేదు. అయితే, ఈ లోన్ కోసం మహిళలు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ, ఈ లోన్ కోసం ప్రతిఒక్కరు ఆధార్ కార్డు, అడ్రస్ ఫ్రూప్, బీపీఎల్ కార్డు, కుల ధృవీకరణ పత్రం వంటి పత్రాలను అందించాలి.

సాధారణంగా మహిళలు ఏదైన లోన్ తీసుకుంటే.. తీసుకున్నా దానికంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. కానీ,ఈ ఉద్యోగిని యోజన పథకంలో అలా కాదు. ఇందులో మీకు ప్రభుత్వం నుంచి సబ్సిడీ వస్తుంది. అలాగే ఈ ఉద్యోగిని యోజన లోన్ కోసం మీరు ఏదైనా ప్రభుత్వ బ్యాంకు వెళ్లి కూడా తీసుకోవచ్చు. అయితే ఇందుకు కావాల్సిన కొన్ని పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. మరి, మహిళలు వ్యాపారం చేసుకొనుటకు అందుబాటులోకి వచ్చిన ఉద్యోగిని యోజన పథకం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker