News

‘మొగలి రేకులు’ సీరియల్ నటుడు మృతి. మృతికి కారణాలు ఇవేనా..!

ఒకప్పుడు బుల్లితెరపై సంచలనం సృష్టించిన సీరియల్ అంటే ఠక్కున గుర్తొచ్చేది చక్రవాకం. మంజుల నాయుడు తెరకెక్కించే సీరియల్స్ అంటే అప్పట్లో టీవీ అడియన్స్‏కు విపరీతమైన ఇష్టముండేది. చక్రవాకం తర్వాత అదే స్తాయిలో ఓ రేంజ్ రెస్పాన్స్ అందుకున్న మరో సీరియల్ మొగలి రేకులు. ఈ సీరియల్స్ కొన్నేళ్లపాటు అత్యధిక రేటింగ్ అందుకుని నంబర్ వన్ స్థానంలో దూసుకుపోయాయి. అయితే చక్రవాకం, మొగలిరేకులు సీరియల్స్‌లో ఇంద్రనీల్‌ తమ్ముడి పాత్రలో నటించి.. ప్రేక్షకుల మనసులో చెరగని స్థానం సంపాదించుకున్న దయ అలియాస్‌ పవిత్రనాథ్‌ మృతి చెందాడు.

ఈ విషయాన్ని ఇంద్రనీల్‌ భార్య మేఘన సోషల్‌ మీడియా ద్వారా తెలియజేసింది. ‘‘పవి.. ఈ బాధను మేం వర్ణించలేకపోతోన్నాం.. మా జీవితంలో నువ్వు చాలా ముఖ్యమైన వాడివి.. మేం ఈ వార్త విన్న తరువాత.. ఇది నిజం కాదని, కాకూడదని కోరుకున్నాను. ఇది అబద్ధం అయితే బాగుందని ఆశపడ్డాను. కానీ నువ్వు నిజంగానే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లావనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతోన్నాం బ్రదర్.

కనీసం నిన్ను ఆఖరి చూపు కూడా చూసుకోలేపోయాం.. గుడ్‌ బై కూడా చెప్పలేకపోయాం.. ఇకపై నిన్ను చాలా మిస్ అవుతాం.. నీ ఆత్మకు శాంతి చేకూరాలి.. నీ ఫ్యామిలీకి ఆ దేవుడు మరింత శక్తిని ఇవ్వాలి’’ అంటై ఇంద్రనీల్, మేఘన ఎమోషనల్‌ పోస్ట్‌ చేశారు. ఇక మేఘన, ఇంద్రనీల్ పోస్ట్‌పై నెటిజనులు, సెలబ్రిటీలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. అసలేం జరిగింది.. దయ చనిపోవడం ఏంటి.. ఇదంతా ఎప్పుడు జరిగింది.. ఎందుకు ఎవరికి తెలియలేదు అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాక అతడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. ఇక గతంలో పవిత్రనాథ్‌పై అతడి భార్య సంచలన ఆరోపణలు చేసింది. అతడికి అమ్మాయిల పిచ్చి ఉందని.. తన ముందే ఇంటికి వారిని తీసుకువచ్చేవాడని.. దీని గురించి ప్రశ్నిస్తే.. తనను కొట్టేవాడని ఆరోపణలు చేసింది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker