ఈ విషయాలు తెలిస్తే ఉదయాన్నే గుర్తుపెట్టుకొని మరీ ఈ గింజలు తింటారు.

ఈ గింజల్లో ప్రొటీన్లు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని కొంతమంది బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటే, మరికొంతమంది కూరల్లో కలిపి తింటారు. మొలకెత్తిన గింజలను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. అదెలాగంటే పెసలు, పల్లీలు, శెనగలు.. మొదలైన గింజల్ని ఒక గిన్నెలో తీసుకొని అందులో కొన్ని నీళ్లు పోసి కనీసం ఆరు గంటల పాటు నాననివ్వాలి.
అయితే మధుమేహం ఉన్నవారికి శెనగలు ఎంతో మేలును చేస్తాయి. ఇవి రక్తంలోని గ్లూకోస్ స్థాయిలను అదుపులో ఉంచుతాయి. ఇందులో ఉండే పొటాషియం,ఐరన్, జింక్ వంటి పోషకాలు అధిక రక్తపోటు సమస్యలను నియంత్రిస్తాయి. పీచు పదార్థం ఎక్కువగా లభిస్తుంది. అందువల్ల ఇది జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
మలబద్దకం వంటి సమస్యలను తగ్గించడంతో పాటు, అజీర్తి ఆహారం సరిగ్గా జరగకపోవడం వంటి సమస్యలను కూడా నివారిస్తుంది.సాధారణంగా మహిళలు ఎదుర్కొనే సమస్య రక్తహీనత ఒకటి. వీటిలో ఇనుము శాతం ఎక్కువగా ఉంటుంది. గనుక రోజు క్రమం తప్పకుండా మొలకెత్తిన శెనగలను తీసుకోవడం వలన శరీరానికి తగినంత ఇనుము అందుతుంది. రక్తహీనత సమస్య దూరం అవుతుంది
ఎర్ర రక్త కణాలు కూడా అభివృద్ధి చెందుతాయి. మొలకెత్తిన శెనగలను ప్రతిరోజు తీసుకుంటే గుండెకు రక్త సరఫరా సక్రమంగా అవుతుంది. వీటిలోని పోషకాలు గుండెకు బలాన్ని చేకూరుస్తాయి.సెనగలలో ఉండే పోషకాలు అమినో ఆసిడ్స్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. దానివల్ల గుండెలోని రక్త కణాలు ముసుకు పోయే ప్రమాదం తగ్గుతుంది. ఫోలేట్ వలన కొత్త కణాలు ఉత్పత్తి జరుగుతుంది.
బరువు తగ్గాలి అనుకునేవారు మొలకెత్తిన సెనగలను తమ డైట్ లో చేర్చుకోవడం వలన మంచి ఫలితాలను పొందవచ్చు. ఎందుకంటే వీటిలో కొలెస్ట్రాల్ స్థాయి తక్కువ. ఎందుకంటే సెనగలు శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించే శక్తిని కలిగి ఉన్నాయి. సెనగలలో ఉండే ఫోలైట్లు శరీరంలోని చెడు కొలెస్ట్రాలను తగ్గిస్తాయి.