ఉదయం నిద్ర లేటుగా లేచే వారికీ షుగర్ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది.

ఇండియా సహా 21 దేశాల్లోని 1,30,000 మందిపై ఈ సర్వే జరిపారు. మొత్తం 10 ఏళ్ల పాటూ ఈ సర్వే కొనసాగింది. చివరకు ఏం తేల్చారంటే… ఇండియా సహా… చాలా దక్షిణ ఆసియా దేశాల్లో డయాబెటిస్ఎక్కువగా వ్యాపించడానికి కారణం తెల్ల బియ్యాన్ని వండుకు తినడమే. అయితే ఇప్పుడున్న రోజుల్లో అందరినీ వేధించే మరో సమస్య డయాబెటీస్. ఈ కాలంలో ఉన్న ఆహార అలవాట్లు, జీవన విధానం కారణంగా షుగర్ అందరికీ వస్తోంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ వ్యాధితో బాధ పడుతున్నారు.
ఈ వ్యాధితో బాధ పడేవారికి అనేక అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. షుగర్ ఉన్న వారికి ఏమైనా గాయాలు తగిలితే వెంటనే మానవు. ఆహార విషయంలో కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. లేదంటే ప్రమాదానికి దారి తీస్తుంది. మధుమేహంతో బాధ పడేవారికి కంటి సంబంధిత సమస్యలతో కూడా ఎదుర్కొంటారు. అయితే ఆలస్యంగా పడుకుని, లేటుగా నిద్రలేసే వారికి కూడా డయాబెటీస్ వస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
తాజాగా యూఎస్ లోని బోస్టన్ లోని బ్రిఘమ్, ఉమెన్స్ హాస్పిటల్ పరిశోధకులు.. ఆలస్యంగా నిద్రపోయి, ఆలస్యంగా నిద్ర లేచే వారిలో మధుమేహం రిస్క్ పై, వారి జీవన శైలిపై అధ్యయనం చేశారు. దీంతో దాదాపు 19 శాతం రిస్క్ ఉందని వెల్లడించారు నిపుణులు. దీన్ని రాత్రి పూట షిఫ్టుల్లో పని చేసే నర్సులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, వాచ్ మెన్లు ఇతర వ్యక్తులపై అధ్యయనం చేయగా ఈ విషయం వెల్లడైంది.
వీరు రాత్రి పూట షిఫ్టుల్లో పని చేసి.. నిద్రలేమి సమస్యలతో బాధ పడుతున్నట్లు గుర్తించారు. ఆలస్యంగా పడుకోవడం, ఆలస్యంగా లేవడం వల్ల తినే ఫుడ్ సరిగ్గా జీర్ణం కాక అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. వీరిలో ఎక్కువగా టైప్-2 డయాబెటీస్ వస్తున్నట్లు వెల్లడించారు. అలాగే తక్కువ నాణ్యత కలిగిన మద్యం ఎక్కువగా తాగడం, ధూమ పానం చేయడం, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ తినడం, రాత్రి పూట ఆసల్యంగా నిద్రించే వారిలో కూడా డయాబెటీస్ ఎక్కువగా వస్తున్నట్లు చెబుతున్నారు నిపుణులు.
ఇలాంటి వారి ఆహారం విషయంలో, నిద్రించే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వెల్లడించారు. లేదంటే దీని వల్ల గుండె సంబంధిత సమస్యలు, మరిన్ని అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పారు పరిశోధకులు.