News

స్వయంగా వండి, వడ్డించి, ఎంతోమంది ఆకలి తీర్చిన నటుడు నందు. ఈ వీడియో చూస్తే హ్యాట్సాఫ్‌ అనాల్సిందే.

సుమారు 25కు పైగా సినిమాల్లో నటించి ట్యాలెంటెడ్‌ నటుడిగా ప్రూవ్‌ చేసుకున్నాడు నందు. ఇటీవల అతను నటించిన మ్యాన్షన్ 23, వధువు వెబ్‌ సిరీస్ లకు ఓటీటీల్లో మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇక వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. త్వరలో మరోసారి తండ్రిగా ప్రమోషన్‌ పొందనున్నాడు నందు. అయితే టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్స్ లో ఒకరు నందూ-గీతా మాధురి. ఇటీవల తాను మరోసారి తండ్రి కాబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసింది. తండ్రి కానున్న వేళా విశేషం.. గొప్ప మనసు చాటుకున్నాడు నందు.

అన్నదానం చేసి 800 వందల మంది ఆకలి తీర్చాడు. అది కూడా స్వయంగా వండి, వడ్డించాడు. ఈ కార్యక్రమం శ్రీ విద్యాపీఠంలో జరిగింది. ఈ కార్యక్రమంలో స్వయంగా కూరగాయలు కోయడం మొదలు.. వంటల్లో కూడా సహాయం అందించి, అందరికీ వడ్డించాడు. ఓ వైపు బుల్లితెరపై స్టార్ యాంకర్ గా రాణిస్తూనే.. సినిమాల్లో నటిస్తున్నాడు. ఇటీవల వెబ్ సీరీస్ తో బిజీగా ఉన్న నందు మ్యాన్షన్ 23, వధువు వెబ్ సీరీస్ లకు ఓటీటీలో మంచి రెస్పాన్స్ రావడంతో మరిన్ని వెబ్ సీరీస్ లో నటించే అవకాశం లభించింది.

స్టార్ సింగర్ గీతామాధురిని పెళ్లి చేసుకున్న తర్వాత ఈ జంటకు ఒక పాప జన్మించింది. త్వరలో మరోసారి తండ్రి కాబోతున్నాడు నందు. ఇటీవలే కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో గీతామాధురి సీమంతం వేడుకలు ఘనంగా జరిగాయి. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా శ్రీ విద్యాపీఠంలో అన్నపూర్ణార్చన చేసిన నందు.. ఏకంగా 800 మంది ఆకలి తీర్చారు. స్వయంగా దగ్గరుండి మరీ వడ్డించాడు.. అంతేకాదు అన్నదానం తర్వాత స్వయంగా పాత్రలు కూడా తానే కడిగారు.

తాను ఒక సెలబ్రెటీ అన్న విషయాన్ని పక్కనబెట్టి సామాన్యుడిగా గొప్ప మనసు చాటుకున్నాడు నందు. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker