News

పెళ్లయిన 4 రోజులకే ఎవరు ఊహించని పని చేసిన నూతన వధువు.

పెళ్ళి అనగా సమాజంలో ఇద్దరు భాగస్వామ్యుల మధ్య హక్కులు, బాధ్యతలను స్థాపించే ఒక చట్టబద్ధమైన ఒప్పందం. వివాహం నిర్వచనం వివిధ సంస్కృతుల ప్రకారం మారుతుంది,కానీ ప్రధానంగా వ్యక్తుల మధ్య సంబంధాలలో,సాధారణంగా సన్నిహిత, లైంగిక సంబంధాలలో సంతరించుకున్న వ్యవస్థ. అయితే ఎవరికైనా ఇష్టం లేని పని చేయాలంటేనే మనసుకు కష్టంగా ఉంటుంది. అలాంటిది ఇష్టం లేని పెళ్లి చేసుకొని జీవితాంతం ఆ భారన్ని గుండెల పై మోయాలంటే నరకంలా ఉంటుంది.

తాజాగా దిండుగల్ జిల్లాకు చెందిన ఓ యువతికి కూడా ఇష్టం లేని పెళ్లి చేసుకొని.. కష్టాంలా భావించిదో ఏమో కానీ, ఏకంగా.. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దిండిగల్ జిల్లా నోచియోడైపట్టి గ్రామనికి చెందిన మురుగేశన్ కు ప్రియ అనే 19 ఏళ్ల కూతురు ఉంది. కాగా, ఈమె ఇదే గ్రామంలోని ఓ కాలేజీలో చదువును కొనసాగిస్తుంది. అయితే ఉన్నట్టుండి మురుగేశన్ తన కూతురికి పెళ్లి చేయలేని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే తేని జిల్లాలోని కూడలూరు ప్రాంతంలో కమలకన్నన్ అనే వ్యక్తితో పెళ్లమురుగేశన్ తన కూతురికి వివాహం నిశ్చయించాడు.

కాగా, కమలకన్నన్ కంబాలోని ఓ ఆర్క్ షాప్ నడుపుతున్నాడు. అయితే వీరిద్దరికి ఈనెల 11న వివాహం జరగింది. కానీ, ప్రియకు మొదటి నుంచి ఈ పెళ్లాంటే ఇష్టం లేదు. కేవలం తన తల్లిదండ్రుల బలవంతం పై ఆమె ఈ పెళ్లి చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. ఇక వివాహానంతరం వరుడి ఇంటికి చేరిన నూతన వధూవరులు మంగళవారం డిండికి చేరారు. కాగా, ఆ రోజు రాత్రి దంపతులిద్దరూ.. విడివిడిగా నిద్రించారు. అయితే మరుసటి రోజు ఉదయం అనగా బుధవారం నాడు ప్రియ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ఇక ఉదయం లేచి చూసిన కమలకన్నన్‌.. తన భార్య ఉరివేసుకుని ఉండడంతో షాక్‌కు గురయ్యాడు. వెంటనే పోలీసులకు ఈ ఘటనకు సంబంధించి సమాచారం తెలియజేశాడు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నా పోలీసులు.. మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. కాగా, ఈ ఘటన పై విచారణ కొనసాగుతోంది. అయితే పెళ్లియిన 4 రోజులకే నూతన వధువు ఇలా ఆత్మహత్య చేసుకోవడం పై ఆర్టీఓ విచారణకు ఆదేశించారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker