Health

పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడితే మీ ప్రాణాలకే ప్రమాదం, చివరి రోజుల్లో..?

కొంద‌రిలో స్వ‌ల్ప ఒళ్లు నొప్పులు వ‌స్తున్న‌ట్టు శాస్త్ర‌వేత్తలు గుర్తించారు. ఇందుకు కార‌ణాలు కూడా ఉన్నాయి. కొవిడ్-19 వ్యాక్సిన్ వేసుకోవడాని ముందు పెయిన్ కిల్ల‌ర్స్ పెయిన్ కిల్లర్ వాడ‌టం వల్ల వ్యాక్సిన్ సమర్థతను ఇవి ప్రభావితం చేస్తాయ‌ని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. అయితే సొంత వైద్యం ఎప్పటికీ ప్రమాదకరమే. ఆరోగ్యం బాగాలేనప్పుడు చాలామంది డాక్టర్‌ను సంప్రదించకుండా సొంతంగా మందులు వేసుకుంటారు. తలనొప్పి, ఒళ్లు నొప్పులకైతే తమకు తెలిసిన మాత్రలను మెడికల్ షాప్స్‌లో కొనుగోలు చేసి వాడేస్తుంటారు. అలా చేయడం చాలా ప్రమాదకరం అంటున్నారు వైద్య నిపుణులు.

ఎందుకంటే.. మాత్ర మోతాదు మించితే.. ప్రతికూల ప్రభావం చూపుతుంది. అది కొత్త చిక్కులను తెచ్చిపెడుతుంది. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నట్లు అవుతుంది. తాజా స్టడీలో మరో షాకింగ్ విషయం తెలిసింది. పెయిన్ కిల్లర్స్ వల్ల మెదడులో నరాలు చిట్లి రక్తస్రావం జరిగే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వైద్యులు ఎక్కువగా సూచించే Aspirin (ఆస్పిరిన్) టాబ్లెట్ చాలా ప్రమాదకరమైనదని తెలిపారు. స్ట్రోక్స్, గుండె సమస్యలతో బాధపడేవారు Aspirin మాత్రలను దగ్గర పెట్టుకోవడం మంచిదని చెబుతుంటారు.

వైద్యలు కూడా వాటిని ఎక్కువగా సూచిస్తుంటారు. అయితే, స్ట్రోక్స్ రెండు రకాలు. అందులో ఒకటి ఇస్కీమిక్ స్ట్రోక్ . రక్త నాళాలు బ్లాక్ అయినప్పుడు మెదడుకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోతుంది. ఫలితంగా ఈ స్ట్రోక్ వస్తోంది. మరొకటి.. హెమరేజిక్ స్ట్రోక్ . మెదడులో లేదా మెదడు చూట్టూ ఏదైనా కారణంతో రక్తస్రావం జరిగినప్పుడు ఏర్పడే బ్లడ్ క్లాట్స్ వల్ల స్ట్రోక్‌కు గురవ్వుతారు. అలాగే వయస్సు పెరిగే కొద్ది ఇలాంటి స్ట్రోక్స్ ముప్పు పెరుగుతుంది. ఈ స్ట్రోక్స్ మరణానికి కూడా దారితీయొచ్చు. ఇలాంటి స్ట్రోక్స్ ఏర్పడినప్పుడు వైద్యులు Asprin మాత్రలను తక్కువ మోతాదులో తీసుకోమని చెబుతారు.

ఈ మాత్రలు రక్తాన్ని పలుచగా మార్చి స్ట్రోక్స్ నుంచి కాపాడుతాయి. అయితే, తాజా స్టడీ ప్రకారం.. ఈ మాత్రల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని, పైగా మెదడులో రక్తస్రావానికి కారణం కావచ్చని తేలింది. స్ట్రోక్స్ సమస్యలేని వృద్ధులకు ఆస్పిరిన్ సూచించినట్లయితే ముప్పు మరింత ఎక్కువ అవుతుందని పరిశోధకులు తెలిపారు. ఐదేళ్లపాటు 70 ఏళ్లు పైబడిన 19,144 మంది వృద్ధులను పరిశీలించగా.. ఈ విషయం బయటపడిందని పేర్కొన్నారు. ఇటీవలే ఈ అధ్యయన వివారానలు JAMAలో ప్రచురించారు.

ఈ పరిశోధనలో పాల్గొన్న సగం మందికి ప్రతిరోజూ తక్కువ మోతాదులో ఆస్పిరిన్, మిగిలిన సగం మంది ప్లేసిబో మాత్రలను ఇచ్చారట. ఆస్పిరిన్ తీసుకున్న వారిలో 1.5 శాతం మంది అధ్యయన కాలంలో ఇస్కీమిక్ స్ట్రోక్‌ను ఎదుర్కొన్నారు. ప్లేసిబో తీసుకున్నవారిలో 1.7 శాతం మందికి ఆ స్ట్రోక్స్ వచ్చాయి. ఆస్పిరిన్ తీసుకున్నవారిలో 1.1 శాతం మంది మెదడు, దాని చుట్టుపక్కల రక్తస్రావం జరిగినట్లు తెలుసుకున్నారు. ప్లెసిబో తీసుకున్నవారిలో అది 0.8 శాతం ఉంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker