News

రైతులకు ఇచ్చిన మాట మరిచి ఆ డబ్బుతో జల్సాలు చేస్తున్న పల్లవి ప్రశాంత్.

గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన యువకుడు బిగ్ బాస్ గదిలో సెలబ్రిటీలకే చుక్కలు చూపించాడు. ఇది ప్రేక్షకులను అలరించింది. తాను రైతుబిడ్డనని పల్లవి ప్రశాంత్ చెప్పుకున్నాడు. రైతుబిడ్డనంటూ సింపతీ గేమ్ ఆడుతున్నాడని ఇతర కంటెస్టెంట్స్ చెప్పినప్పటికీ… తన ఐడెంటింటీ అదేనని.. తాను చేసే పనిని చెబితే తప్పేమిటని పల్లవి ప్రశాంత్ గట్టిగా సమాధానం చెప్పాడు. అయితే విన్నర్ గా పల్లవి ప్రశాంత్ రూ. 35 లక్షల ప్రైజ్ మనీ, ఒక కారు, డైమండ్ నెక్లెస్ బహుమతులుగా అందుకున్నాడు.

ప్రేక్షకుల మనసులు గెలిచేందుకు పల్లవి ప్రశాంత్ చాలా కష్టపడ్డాడు. టాస్క్స్, గేమ్స్ లో సత్తా చాటాడు. అలాగే రైతు బిడ్డ ట్యాగ్ కూడా అతనికి బాగా ఉపయోగపడింది. కాగా ఒకవేళ తాను టైటిల్ విన్నర్ అయితే ఆ డబ్బులు పేద రైతులకు పంచిపెడతాని హామీ ఇచ్చాడు. బిగ్ బాస్ షో వేదికగా ఈ మాట పలుమార్లు చెప్పాడు. మరి చెప్పినట్లే పల్లవి ప్రశాంత్ తానూ గెలుచుకున్న డబ్బులు పేద రైతులకు పంచాడా? లేదా ? అనే సందేహాలు మొదలయ్యాయి. షో ముగిసి రెండు నెలలు అవుతుంది.

అయినా పల్లవి ప్రశాంత్ పేద రైతులకు డబ్బులు ఇచ్చిన దాఖలాలు లేవు. తాను సహాయం చేసిన వీడియోలు షేర్ చేస్తానని. పంచిన ప్రతి రూపాయికి లెక్క చెబుతానని పల్లవి ప్రశాంత్ చెప్పాడు. అయితే ఆ సూచనలేమీ కనిపించడం లేదు. పల్లవి ప్రశాంత్ వేడుకల్లో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. సెలబ్రిటీ హోదా ఎంజాయ్ చేస్తున్నాడు. షాపింగ్ మాల్స్ ఓపెన్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. తన స్పై బ్యాచ్ శివాజీ, ప్రిన్స్ యావర్ లతో పార్టీలు ఎంజాయ్ చేస్తున్నాడని సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి.

రైతుబిడ్డ హోదాతో టైటిల్ గెలిచిన పల్లవి ప్రశాంత్ సామాన్య జీవితాన్ని వదిలేశాడనిపిస్తుంది. ఒకసారి లగ్జరీలకు అలవాటు పడ్డాక ఎండలో చాకిరి చేయడం అంత సులభం కాదు. పల్లవి ప్రశాంత్ ఇకపై వ్యవసాయం చేయకపోవచ్చు అంటున్నారు. ఆ మధ్య శివాజీ పల్లవి ప్రశాంత్ ని నటుడు ధనుష్ తో పోల్చాడు. ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్ లతో సినిమా తీస్తానని కూడా చెప్పాడు. కెరీర్ లో ఎదగాలని ఎవరైనా కోరుకుంటారు. పల్లవి ప్రశాంత్ ఇచ్చిన హామీ ప్రకారం ప్రైజ్ మనీ రైతులకు పంచాలని అంటున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker