News

బుల్లితెరపైకి కుమారీ ఆంటీ ఎంట్రీ, స్టేజ్ పైనే అందరికీ నాన్ వెజ్ భోజనం పెట్టేసిందిగా..! వైరల్ వీడియో.

నెట్టింట పాపులారిటీని బట్టి.. ఆమె త్వరలోనే ఏదొక టీవీ షోలో పాల్గొనడం ఖాయమనుకున్నారు అంతా. ఇక ఇదే విషయంపై నెట్టింట వీడియోస్ కూడా రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు ప్రముఖ రియాల్టీ షో బిగ్ బాస్ కు సంబంధించిన ఓ ఈవెంట్లో సందడి చేసింది కుమారీ ఆంటీ. బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ అందరితో కలిసి బిగ్ బాస్ ఉత్సవ్ అనే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే ఈ కార్యక్రమానికి కుమారి ఆంటీని అతిథిగా తీసుకువచ్చారు. బిగ్ బాస్ స్టేజ్ పై కూడా కుమారీ ఆంటీ ఆమె చేతి వంట రుచి చూపించినట్లు తెలుస్తోంది.

నాన్ వెజ్ భోజనాన్ని అందిరికీ వడ్డించినట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. అయితే కుమారీ ఆంటీ క్రేజ్‌ చూసి.. ఆమె నెక్స్ట్‌ బిగ్‌బాస్‌ సీజన్‌లోకి వస్తుందని అంతా ఫిక్సయ్యారు. అయితే ఆలోపే కుమారీ ఆంటీ ఈటీవీ షోలలో కనిపిస్తుందని చాలామంది భావించారు. అయితే వారి అంచనాలు తలకిందులు చేస్తూ.. కుమారీ ఆంటీ స్టార్‌ మాలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. కుమారీ ఆంటీ స్టార్‌ మా బీబీ ఉత్సవంలో సందడి చేసింది.

ఆ వీడియో ఇప్పుడు తెగ వైరల్‌ అవుతోంది. స్టార్‌ మా నిర్వహించిన బీబీ ఉత్సవం కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా వచ్చింది కుమారీ ఆంటీ. పైగా షోలో పాల్గొన్నవారందరికి తన ఫుడ్‌ స్టాల్‌ నుంచే నాన్‌వెజ్‌ భోజనం తీసుకువచ్చి.. వారికి స్వయంగా వడ్డించినట్లు వీడియోలో ఉంది. దీనిలో కంటెస్టెంట్లు అందరూ చేతిలో విస్తరాకులు పట్టుకుని భోజనం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి యాంకర్‌గా ఉన్న శ్రీముఖి మా బీబీ ఉత్సవంలో మాకు కడుపు నిండా భోజనం పెట్టిన మా కుమారీ ఆంటీకి థాంక్స్‌ అని చెప్పడం వీడియోలో చూడవచ్చు.

ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతుండటంతో.. కుమారీ ఆంటీ క్రేజ్‌ రోజురోజుకు పెరుగుతుంది కదా.. త్వరలోనే ఏదైనా సీరియల్‌ లేదా బిగ్‌బాస్‌ షోలో కనిపించినా ఆశ్చర్యం లేదు అని కామెంట్స్‌ చేస్తున్నారు నెటిజనులు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker