News

కోట్లు వదులుకుని నటనకు గుడ్ బై చెప్పి సన్యాసిగా మారిన స్టార్ హీరోయిన్.

ఈ హీరోయిన్ ఒక మోడల్. మోడల్ గా కేరీర్ మొదలుపెట్టిన ఈమెసినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తన అందం, అభినయంతో ప్రేక్షకులను మనసును దోచేశారు. అలాగే ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోల సరసన వరుస అవకాశాలను అందుకుంటూ.. మంచి పాపులారీటి సంపాదించుకున్నారు. అయితే 1996లో ‘ఖిలాడీ కా ఖిలాడీ’ సినిమాతో కథానాయికగా బాలీవుడ్ అరంగేట్రం చేశారు.

2003లో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘భూత్’ సినిమాలోనూ నటించారు. మంజీత్ ఖోస్లా అనే దెయ్యం పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. అజయ్ దేవగన్, ఊర్మిళ మటోండ్కర్, నానా పటేకర్, రేఖ, ఫర్దీన్ ఖాన్ వంటి స్టార్లతో కలిసి పనిచేసింది. ఓవైపు సినిమాలు.. మరోవైపు సీరియల్లలోనూ నటించారు బర్ఖా. 1857 క్రాంతితో సహా పలు టీవీ సీరియల్స్‌లో నటించింది. ఇందులో ఆమె రాణి లక్ష్మీబాయి పాత్రను పోషించింది.

భూత్ తర్వాత, బర్ఖాకు ఆమె కోరుకున్న పాత్రలు లభించకపోవడంతో బుల్లితెరపైకి రీఎంట్రీ ఇచ్చింది. 2005 నుండి 2009 వరకు ప్రముఖ జీ టీవీ షో సాత్ ఫేరే – సలోని కా సఫర్‌లో కనిపించింది. 2010లో నిర్మాతగా మారాలని నిర్ణయించుకుంది. ప్రతిభావంతులైన స్వతంత్ర చిత్రనిర్మాతలను ప్రోత్సహించడానికి గోల్డెన్ గేట్ LLCని ప్రారంభించింది. సోచ్ లో, సుర్ఖాబ్ అనే రెండు చిత్రాలను నిర్మించి, నటించింది. కానీ ఇప్పుడు ఉన్నట్లుండి సన్యాసిగా మారిపోయారు.

బౌద్ధ మతాన్ని స్వీకరించిన తర్వాత ‘గ్యాల్టెన్ సామ్టెన్’ గా తన పేరును మార్చుకున్నారు. ప్రస్తుతం ఆమె పర్వతాలు, ఆశ్రమాలలలో తిరుగుతూ కనిపిస్తున్నారు. తన జీవితాంతం దలైలామాను అమితంగా అనుసరించిన బర్ఖా, 2012లో బౌద్ధమతాన్ని స్వీకరించాలని నిర్ణయించుకుంది. కానీ ఇప్పటికీ ఆమె అనుకున్న పని జరిగింది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker