వేణు స్వామి సంచలన జోస్యం , పవన్ కి మూడోసారి విడాకులు తప్పవు.
![](https://www.manaarogyamkosam.com/wp-content/uploads/2024/01/pawan549786-780x470.jpg)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. అంతేకాదు 2023లో చంద్రబాబు జైలుకెళ్లే అవకాశం ఉందని అన్నారు. ఆ రకంగానే ఏపీ రాజకీయాలలో పరిస్థితులు చోటుచేసుకున్నాయి. దీంతో వేణు స్వామి మాటలు జనం నమ్మటం మొదలుపెట్టారు. ఈ క్రమంలో కొన్ని సినిమాలు గురించి ఇంకా పలు సెలబ్రిటీల జీవితాలు గురించి ఇటీవల వేణు స్వామి తెలియజేస్తున్నారు.
అయితే ఇటీవల ప్రభాస్ గురించి వేణు స్వామి చేసిన కామెంట్స్ ఫ్యాన్స్ ని హర్ట్ చేశాయి. సలార్ కూడా ప్లాప్ అవుతుందని అన్నాడు. దాంతో వేణు స్వామి మీద వారు మండిపడ్డారు. సలార్ విషయంలో వేణు స్వామి జోస్యం తప్పయిందని ఏకిపారేశారు. తాజాగా వేణు స్వామి పవన్ కళ్యాణ్ భవిష్యత్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ కి మరలా విడాకులు తప్పవు. ఆయన జాతకరీత్యా 2024లో మూడోసారి విడాకులు తీసుకుంటారు . సినిమా కెరీర్ పరంగా జాతకం అద్భుతంగా ఉంది. వ్యక్తిగత సమస్యలతో సతమతం అవుతాడు. పవన్ కళ్యాణ్ కేవలం త్రివిక్రమ్ మాటలు వింటారు. అయితే త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోరు.
చెప్పేవారు లేక అనవసరంగా రాజకీయాలు చేసి భవిష్యత్ నాశనం చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే మార్గం వెతకడం లేదు. పవన్ కళ్యాణ్ సీఎం అయితే సంతోషించేవారిలో నేను కూడా ఒకరిని అన్నాడు. కానీ నా మాటలు తప్పుగా అర్థం చేసుకుని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నన్ను విమర్శిస్తున్నారని వేణు స్వామి చెప్పుకొచ్చాడు.
![](https://www.manaarogyamkosam.com/wp-content/uploads/2024/01/312032154-1024x536.jpg)
వేణు స్వామి మాటల ప్రకారం మూడో భార్య అన్నాలెజినోవాకు కూడా పవన్ కళ్యాణ్ విడాకులు ఇవ్వనున్నాడు. అది కూడా ఈ ఏడాదే నట. గతంలో కూడా వేణు స్వామి పవన్ కళ్యాణ్ కి రాజకీయ భవిష్యత్తు లేదని చెప్పడం కొసమెరుపు. వేణు స్వామి తాజా వ్యాఖ్యలు మరోసారి కలకలం రేపాయి. వేణు స్వామి జోస్యం పై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.