News

క్యాన్సర్ తో స్టార్ హీరోయిన్ కన్నుమూత, బిగ్ షాక్‌లో స్టార్ హీరోలు.

ఇప్పుడు ఓ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేయడంతో పాటు అనుమానాలకు తావినిస్తుంది. అదే వివాదాస్పద నటి, మోడల్ పూనమ్ పాండే కన్నుమూసిన వార్త. సోషల్ మీడియాలో ఆమె ఇన్ స్టా ఖాతా నుండి ఈ పోస్టు వచ్చింది. అంతే వెంటనే ఆ న్యూస్ వ్యాపించేసింది. అయితే బాలీవుడ్ హీరోయిన్ పూనమ్ పాండే కన్నుమూశారు. పూనమ్ పాండే క్యాన్సర్ కారణంగా మరణించినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ లో పలు సినిమాల్లో ఆమె నటించింది. అంతే కాదు చాలా కాంట్రవర్సీలో కూడా చిక్కుకుంది ఈ భామ.

తాజాగా క్యాన్సర్ కారణంగా పూనమ్ పాండే కన్నుమూశారని తెలుస్తోంది. పూనమ్ పాండే మరణ వార్త విని బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నిన్న మొన్నటి వరకు యాక్టివ్ గా ఉన్న పూనమ్ ఇప్పుడు సడన్ గా చనిపోవడం ఏంటా అని అంతా షాక్ కు గురవుతున్నారు. పూనమ్‌ను గర్భాశయ క్యాన్సర్‌తో మరణించారని సోషల్ మీడియాలో పోస్ట్ లు వైరల్ అవుతున్నాయి. పూనమ్ పాండే సినిమాలతో కంటే వివాదాలతోనే ఎక్కువ ఫెమస్ అయ్యింది ఈ భామ. బాలీవుడ్ హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న పూనమ్ పాండే చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది.

కేవలం సోషల్ మీడియాతోనే అభిమానులకు టచ్ లో ఉంటుంది. గతంలో చాల రకాల వివాదాస్పద కామెంట్స్ చేసి హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో రకరకాల ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. హాట్ హాట్ ఫోటోలు, వీడియోలు తరచు పంచుకునే పూనమ్ పాండే సడన్ గా చనిపోవడం అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఆమధ్య తన భర్త తనను వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. తన భర్త కొట్టడంతో దెబ్బలు తిన్న ఫోటోలను కూడా షేర్ చేసింది పూనమ్ పాండే.

పూనమ్ పాండే మరణ వార్త తెలిసి సినీ ప్రముఖులు, ఆమె అభిమానులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఇది నిజం కాదు ఆమె ఇన్ స్టా గ్రామ్ హ్యాక్ అయ్యిందని కామెంట్స్ చేస్తున్నారు. పూనమ్ పాండే చివరిగా కంగనా రనౌత్ రియాలిటీ షో లాక్ అప్‌లో కనిపించింది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker