ప్రభాస్ జాతకం చెప్పిన వేణు స్వామిపై కృష్ణం రాజు భార్య సంచలన వ్యాక్యలు.
![](https://www.manaarogyamkosam.com/wp-content/uploads/2024/01/swamy987978546-780x470.jpg)
కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి వైసీపీ అభ్యర్థిగా నరసాపురం ఎంపీ స్థానం నుంచి పోటీపడతారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. పెద్దమ్మ కోసం అవసరమైతే బాహుబలి ప్రభాస్ కూడా ప్రచారం చేస్తారనీ వార్తలు షికారు చేశాయి. క్షత్రియ ఓటర్ల ప్రాబల్యమున్న నరసాపురం నియోజకవర్గంలో కృష్ణంరాజు వంటి క్లీన్ ఇమేజ్ ఉన్న కుటుంబం నుంచి అభ్యర్థి అయితే బాగుంటుందని వైసీపీ అధిష్టానం కూడా భావిస్తూ ఉండొచ్చు. అయితే సలార్ సినిమా విడుదల సమయంలోనూ ప్రభాస్పై కామెంట్లు చేశారు.
ప్రభాస్కు ఆరోగ్యం బాగోలేదని అన్నారు. సలార్ మూవీ ప్లాప్ అవుతుందని తేల్చేశారు. అయితే, ఆయన అన్నదానికి భిన్నంగా సలార్ రిజల్ట్స్ వచ్చాయి. మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. ఇక, ప్రభాస్ పెళ్లి, ఆరోగ్యంపై వేణుస్వామి చేసిన వ్యాఖ్యలపై తాజాగా కృష్ణంరాజు భార్య శ్యామలా దేవి స్పందించారు. ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘ సోషల్ మీడియాలో కింద ఒకటి రాస్తారు. చూపించేది ఒకటి. దాని వల్ల వాళ్లకు ఉపయోగం ఉంటదో నాకు తెలీదు. ఎవరైనా సంతోషంగా ఉంటే.. మాకు కూడా సంతోషంగా ఉంటుంది.
కొన్ని కొన్ని మరీ ఇబ్బందికరమైనవి ఉంటాయి. వీటి వల్ల పెద్దగా బాధ ఎక్కడా రాదు. ఏమనుకున్నాకూడా.. వాళ్లకు కూడా మా ఫ్యామిలీ గురించి తెలుసు. వాళ్లు అందరూ రెస్పెక్ట్గానే ఉంటారు. రెస్పెక్ట్ ఇస్తారు. కానీ, నాకు ఎక్కడ వస్తుందంటే.. ఆ వేణు స్వామి హెల్త్ గురించి అంటే .. బాబు జాతకం గురించి చెప్పినపుడు మాత్రం బాధేస్తుంది. మొన్న ఎవరో చెబితే తెలిసింది. ప్రభాస్ గారి జాతకం వాళ్ల మదర్కు తప్ప వేరే వాళ్లకు తెలీదు. అలాంటిది ఆ వేణు స్వామికి ఎలా తెలిసింది.
అవన్నీ పుకార్లు.. వేరే వాళ్లు బాధపడతారు కదా.. మేడమ్ మీరే అడగండి అంటూ ఉంటారు. నేనెందుకు అడగడం అని ఊరుకుంటూ ఉంటాను. పుకార్లని మీరే కదా చెబుతున్నారు. ఏం కాదు. ఊరుకోండి అంటూ ఉంటాను. మీరెవ్వరూ పట్టించుకోకండి అంటుంటాను. మాకు ఎవరినీ ఏమీ అనే అలవాటు లేదు. కృష్ణం రాజు గారు అజాతశత్రువు. ఆయన్ను అనే వాళ్లు ప్రపంచలోనే లేరు. కానీ, 100లో ఓ పర్సెంట్ అనే వారు ఉండేవారు. ఆయన పెద్దగా పట్టించుకునే వారు కాదు. మరి, శ్యామలా దేవి.. వేణు స్వామిపై స్పందించటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.