News

జైల్లో రెండు రోజులు నరకం, వాళ్లకు నా గతే పడుతుంది. ప్రశాంత్ కామెంట్స్ వైరల్!

జీవితంలో రెండు చోట్లకు వెళ్లకూడదు ఒకటి హాస్పిటల్, రెండోది జైలు అని ప్రశాంత్ ఆవేదన వ్యక్తం చేశాడు. తాను జైలుకు వెళ్తానని అస్సలు అనుకోలేదని, చేయని తప్పుకు జైలుకు వెళ్లాల్సి వచ్చిందని ప్రశాంత్ అన్నాడు. తాజా ఇంటర్వ్యూలో పల్లవి ప్రశాంత్ మాట్లాడుతూ .. పల్లవి ప్రశాంత్ అన్నపూర్ణ స్టూడియో నుండి బయటకు రాకముందే పరిస్థితి అదుపు తప్పింది. అల్లరి మూకలు ప్రైవేట్ వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సులపై రాళ్లు రువ్వారు. ప్రాపర్టీ డామేజ్ చేశారు. దాంతో పల్లవి ప్రశాంత్ కి పోలీసులు సూచనలు చేశారు.

ఎలాంటి ర్యాలీ చేయకుండా ఇంటికి వెళ్లిపోవాలని వెనక డోర్ నుండి పంపించారు. పోలీసుల మాట లెక్క చేయని పల్లవి ప్రశాంత్ ర్యాలీ చేశాడు. ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. పల్లవి ప్రశాంత్ తో పాటు అతని తమ్ముడిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. రెండు రోజుల తర్వాత బెయిల్ పై పల్లవి ప్రశాంత్ విడుదల అయ్యాడు. కాగా ఈ రెండు రోజులు జైల్లో ఏం జరిగిందో పల్లవి ప్రశాంత్ చెప్పుకొచ్చాడు.

నాకు రెండు రోజులు కష్టంగా గడిచింది. అన్నం తిన బుద్ధి కాలేదు. రెండు రోజులు తినకుండానే ఉన్నాను. తోటి ఖైదీలు తినమని బ్రతిమిలాడితే తిన్నాను. జైలు కూడు బాగుంది. నన్ను విఐపీ లా ట్రీట్ చేసినా? మామూలుగా ట్రీట్ చేసినా? బాగానే ఉంది. ఖైదీలు అంతా నా దగ్గరకు వచ్చి అన్నా అన్నా అంటుండేవారు. బిగ్ బాస్ షో ఎవరు గెలిచారని అడిగేవారు. నేను జైలుకు వెళ్ళాక వచ్చిన ఖైదీలు బయట జరిగిన గొడవలు గురించి వాళ్లకు చెప్పేవాళ్ళు. నేను జైల్లో భయపడలేదు. ఎందుకంటే నేను తప్పు చేయలేదు.

ఎవరో చేసిన తప్పుకు నేను శిక్ష అనుభవించాను. నేను నేరం చేయలేదని అందరికీ తెలుసు.. నేను పారిపోయానని ప్రచారం చేశారు. నేను ఎక్కడికీ వెళ్ళలేదు. వచ్చారు అరెస్ట్ చేశారు. నాకు పట్టిన గతి నన్ను విమర్శించిన వాళ్లకు పట్టవచ్చు. జైలులో చాలా విషయాలు నేర్చుకున్నాను. జీవితంలో రెండు ప్రదేశాలకు వెళ్ళకూడదు. ఒకటి హాస్పిటల్, మరొకటి జైలు… అని అన్నాడు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker