News

అసలు షో మొదలైంది, రైతు బిడ్డ అసలు గుట్టు బయటపడింది.

‘ఉల్టా పల్టా’ అని తెగ హడావుడి చేశాడు. కానీ తొలివారం పెద్దగా డిఫరెన్స్ అయితే కనిపించలేదు. దీంతో ఈ సీజన్ కూడా అంతా యధావిధాగానే ఉండనుందా అని అనుకున్నారు. కానీ సోమవారం వచ్చేసరికి సీన్ మొత్తం మారిపోయింది. శివాజీ, ప్రశాంత్ ని అందరూ ఉతికే ఆరేశారు. అయితే హౌస్ లోకి అతడు రావడానికి ముఖ్య ఉద్దేశం రైతులకు సంబంధించిన కష్టాలను అందరికీ తెలియజేయడమే అన్నట్టుగా ముందు మాట్లాడిన ప్రశాంత్ ఇప్పుడు అసలు తాను ఒక రైతుని అన్న విషయాన్ని కూడా మర్చిపోయి ప్రవర్తిస్తున్నాడు.

అయితే తాజాగా ఇతడి గురించి ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ ఛానల్ ఓనర్ అన్వేష్ సంచలన కామెంట్లు చేస్తూ పల్లవి ప్రశాంత్ గుట్టు రట్టు చేశారు. ప్రశాంత్ మాట్లాడే మాటలన్నీ డ్రామాలే అంటూ ఒక్క మాటతో అతడి ఎటువంటి వాడో చెప్పాడు. అసలు విషయంలోకెళితే బిగ్ బాస్ లోకి రావడానికి ముందు ఒకసారి అన్వేష్ తో ప్రశాంత్ మాట్లాడగా ..

నేను ఎలాగైనా బిగ్ బాస్ షోలోకి వెళ్లి పాపులర్ అవ్వాలి అన్న అని.. ప్రశాంత్ మాటలకు అన్వేష్ షాక్ అయ్యారట.ఈ షో కి వెళ్లడం వల్ల నీకేం వస్తుంది అని అడిగితే నేను రైతుల గురించి అందరికీ తెలిసేలా చేస్తాను అని ప్రశాంత్ సమాధానం చెప్పడంతో రైతుల గురించి అందరికీ తెలుసు ప్రత్యేకంగా నువ్వేమి చెప్పేది అంటూ అన్వేష్ కూడా ప్రశ్నించాడట.

దీంతో హర్ట్ అయిన పల్లవి ప్రశాంత్ అతన్ని బ్లాక్ చేశారని అయితే ఈ విషయాన్ని తాజాగా ఒక వీడియోలో అన్వేష్ వెల్లడించారు. వాడిని చూస్తేనే ఎంత పెద్ద మోసగాడో అర్థమవుతుంది. రైతుల గురించి ఏమో చెప్తాను.. చేస్తాను అని బిల్డప్ ఇచ్చి బిగ్ బాస్ షోలోకి నన్ను తీసుకోండి అంటూ వీడియోలు మీద వీడియోలు పెట్టాడు చివరికి హౌస్ లోకి వెళ్ళిన తర్వాత అమ్మాయిలతో పులిహోర కలుపుతున్నాడు అంటూ అన్వేష్ మండిపడ్డారు.

మొత్తానికైతే రైతును అడ్డం పెట్టుకొని రైతు బిడ్డ అంటున్న పల్లవి ప్రశాంత్ తీరుపై యూట్యూబర్లు మండిపడుతున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker