News

రామోజీరావు ఆ సినిమాలో నటించాడనే విషయం మీకు తెలుసా..? ఆ సినిమా ఏంటంటే..?

మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున దగ్గర్నుంచి రామ్ చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఇలా ప్రతి ఒక్క సెలబ్రెటీ చైల్డ్ హుడ్ పిక్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. కానీ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమున్న ఓ వ్యక్తి రేర్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పైన ఫోటోను చూశారు కదా.. అందులో కనిపిస్తున్న ఆ వ్యక్తి తెలుగు రాష్ట్రాల ప్రజలకు చాలా సుపరిచితం. అలాగే ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఎలాంటి వార్తలను జనంలోకి తీసుకెళ్లాలి.

జనాన్ని ఎలా చైతన్య పరచాలి అనే ఒక నిజాయితీతో కూడిన వార్తలను రాస్తూ మీడియాను నడిపించాడు. ఇక అలాగే సినిమా ప్రొడ్యూసర్ గా మారి చాలామంది హీరోలకు లైఫ్ ఇచ్చాడు. తరుణ్, ఉదయ్ కిరణ్, ఎన్టీఆర్ లాంటి హీరోలను తన ప్రొడక్షన్ హౌస్ ద్వారా పరిచయం చేసి వాళ్ళకంటూ ఒక గొప్ప గుర్తింపు తీసుకువచ్చాడు. ఇక అంతటి ఘన కీర్తిని సంపాదించుకున్న రామోజీరావు ఒక సినిమా లో అతిథి పాత్ర లో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించాడు అనే విషయం మనలో చాలా మంది కి తెలీదు.

1978లో యు.విశ్వేశ్వరరావు నిర్మించిన ‘మార్పు’ అనే సినిమాలో న్యాయమూర్తి పాత్రలో కొద్దిసేపు కనిపించి తన పాత్రకు న్యాయం చేయడమే కాకుండా ప్రేక్షకులను అలరించాడనే చెప్పాలి. ఆయన నటించింది కొద్దిసేపే అయినప్పటికీ సినిమా పోస్టర్ మీద తన ఫోటో వేయడం అప్పట్లో సంచలనాన్ని సృష్టించింది. సినిమా అంటే ఆయనకి ప్రాణం..దానికోసం ఏం చేయడానికైనా ఆయన సిద్ధంగా ఉంటారు.

ఇక అలాంటి ఒక గొప్ప వ్యక్తి ఈరోజు ఉదయం మనందరిని వదిలేసి అనంత లోకాలకు వెళ్లిపోవడం అనేది ప్రతి ఒక్క సినిమా అభిమానిని తీవ్రమైన బాధకు గురి చేస్తుందనే చెప్పాలి. ఇక ఈయన మరణం పట్ల సినీ రాజకీయ ప్రముఖులు సైతం సంతాపాన్ని తెలియజేశారు. ఇక ఆయనతో ఉన్న అనుబంధాన్ని కూడా తెలియజేస్తూ ఆయన లేని లోటు తీరనిది అంటూ ఆయన గురించి తలుచుకుంటూ చాలా మంది కన్నీరు మున్నీరు అవుతున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker