రష్మిక మందన్న మరో డీప్ ఫేక్ వీడియో వైరల్. ఈ సారి వీడియో ఎలా ఉందంటే..?
చిత్ర పరిశ్రమలో నిత్య యవ్వనంగా కనిపించే హీరోయిన్లలో రష్మిక మందన్న ఒకరు. ఆమె క్యూట్ లుక్స్, ఆకట్టుకునే ఎక్స్ప్రెషన్స్, సహజ సౌందర్యంతో ప్రేక్షకులను చూపుతిప్పుకొనివ్వకుండా చేస్తుంది. ఈ ముద్దుగుమ్మ అందానికి యావత్ భారతదేశం దాసోహం అంటుంది. అందుకే ఆమెకు నేషనల్ క్రష్ అనే టైటిల్ కూడా దక్కింది. అయితే నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరోసారి దుండగులకు టార్గెట్ అయ్యింది.
మొన్నీమధ్య డీప్ ఫేక్ వీడియో వివాదం నుంచి బయటపడింది.. అది తాను కాదు అని తేలింది. ఇప్పుడు మరోసారి మరో వీడియోను సోషల్ మీడియాలో వదిలారు.. ఇప్పుడు ఆ వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.. ఇందులోనూ సేమ్ అదే మాదిరిగా ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సీ) ద్వారా ఆమె ఫేస్ని మార్ఫింగ్ చేయడం గమనార్హం.
ఈ వీడియో ఇంటర్నెట్ రచ్చ చేస్తుంది… ఈసారి ఇంకా క్లియర్ డీప్ ఫేక్ వీడియోను సృష్టించారు.. గతంలో కన్నా ఇది డీప్ గా ఉంది..అందులో ఓ యువతి డ్యాన్స్ చేస్తూ కనిపించింది. దీనికి రష్మిక ముఖంను ఎడిట్ చేశారు. ఈ వీడియోపై పలువురు వ్యతిరేకత వ్యక్తం చేశారు. ‘రష్మిక మందన్న డీప్ఫేక్ వీడియో చేయవద్దు’ అని రష్మిక మందన్న అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. కొందరు పోలీసుల ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇలాంటి వాటిని ఆపాలని హెచ్చరిస్తున్నారు.. వరుస సినిమాలతో ఇండస్ట్రీని ఏలేస్తున్న రష్మికకి ఇలాంటివి వరుసగా ఎదురు కావడం బాధాకరమనే చెప్పాలి. మరి వీటిపై అధికారులు, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.. ఏది ఏమైన మరోసారి ఇలాంటి వీడియో బయటకు రావడంతో ఆమె ఫ్యాన్స్ నిరాశను వ్యక్తం చేస్తున్నారు..