News

అశ్లీల వీడియోలు చూస్తున్న కొడుకుకు విషం పెట్టి చంపేసిన తండ్రి. ఎక్కడో తెలుసా..?

మహారాష్ట్రలోని శోలాపూర్‌ జిల్లాకు చెందిన విజయ్‌ టైలర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తన కొడుకు విశాల్‌ను సమీపంలోని పాఠశాలలో చదివిస్తున్నాడు. రోజూ స్కూల్‌కు ఫోన్‌ తీసుకెళ్తున్న విశాల్‌ అక్కడ అశ్లీల చిత్రాలు చూసేవాడు. దీనిపై ఉపాధ్యాయులు పలుమార్లు తండ్రికి ఫిర్యాదు చేశారు. ఫోన్‌ ఇవ్వొద్దని సూచించారు. అయినా విశాల్‌ రహస్యంగా ఫోన్‌ తీసుకెళ్లేవాడు. తన చెడిపోవడమే కాకుండా తోటి విద్యార్థులను కూడా చెడగొడుతుండడంతో విశాల్‌ తండ్రి విజయ్‌ను పిలిపించి మందలించారు.

పూర్తీ విరలోకి వెళ్తే మహారాష్ట్రలోని సోలాపూర్‌లో జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. నిందితుడు విజయ్ బట్టును తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. తమ కుమారుడు కనిపించడం లేదంటూ గత నెల 13న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కాసేపటికే కుర్రాడి మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టం నివేదికలో విషం తీసుకోవడం వల్లే మరణించినట్టు తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కుటుంబ సభ్యులను ప్రశ్నించారు.

వారి సమాధానాలు పొంతన లేకుండా ఉండడంతో అనుమానించారు. కుర్రాడి తండ్రిని గట్టిగా ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. విశాల్ చదువును పక్కనపెట్టేసి ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూస్తూ స్కూల్‌లో అమ్మాయిలను వేధించడం మొదలుపెట్టాడు. విషయం తెలిసిన తల్లిదండ్రులు పద్ధతి మార్చుకోమని చెప్పినా పెడచెవిన పెట్టాడు. మరోవైపు స్కూలు నుంచి కూడా ఫిర్యాదులు పెరిగాయి. కుమారుడి ప్రవర్తనపై విసిగిపోయిన తండ్రి జనవరి 13న తన 14 ఏళ్ల కుమారుడు విశాల్‌ను బైక్‌పై తుల్జాపూర్ రోడ్‌కు తీసుకెళ్లాడు.

అక్కడ కూల్‌డ్రింక్ కొని అందులో విషం కలిపి కుమారుడికి ఇచ్చాడు. విశాల్ అపస్మారక స్థితికి చేరుకున్నాక అతడు తిరిగి ఒంటరిగా ఇంటికి చేరుకున్నాడు. అదే రోజు సాయంత్రం భార్యాభర్తలు ఇద్దరూ స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన కుమారుడు కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అసలు నిందితుడు తండ్రేనని తేలడంతో తాజాగా అతడిని కటకటాల వెనక్కి పంపారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker