News

శేఖర్ మాస్టర్ ఇంట తీవ్ర విషాదం, అసలు ఏం జరిగిందంటే..?

శేఖర్ మాస్టర్ అన్న భార్య దుర్గ పది రోజుల క్రితం మృతి చెందారు. ఈరోజు ఆమె దశదిన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో వదిన మృతి చెందిన విషయాన్ని తలుచుకుంటూ శేఖర్ మాస్టర్ ఎమోషనల్ అయ్యాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ షేర్ చేసి ఆవేదన వ్యక్తం చేశారు. కొన్నాళ్లుగా క్యాన్సర్ తో పోరాడుతున్న దుర్గ పది రోజుల క్రితం కన్నుమూశారు.

అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ కొరియోగ్రాఫర్ లలో శేఖర్ మాస్టర్ కూడా ఒకరు. దాదాపు అందరు స్టార్ హీరోలతో పని చేసి ఎప్పటికప్పుడు తన డాన్స్ కొరియోగ్రఫీ తో బ్లాక్ బస్టర్ లు అందుకుంటూనే ఉంటారు శేఖర్ మాస్టర్. ప్రస్తుతం పలు సినిమాలు చేస్తున్న ఇతడి ఇంట్లో ఇప్పుడు విషాదం నెలకొంది.

తన వదిన చనిపోయారని చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలోనే శేఖర్ మాస్టర్.. తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. ఆమె మరణానికి గల కారణాలను మాత్రం మాస్టర్ వెల్లడించలేదు. ‘వదిన మిస్ యూ.. నువ్వు ఎంతో బాధను అనుభవించావ్.. అయినా ఎంత ధైర్యంగా నిలబడ్డావ్.. నువ్వే నాకు ధైర్యాన్న నూరిపోసావ్.. జీవితంపై సానుకూల దృక్పథాన్ని అందించావ్. ఇక నువ్వు లేవనే వార్తను ఇంకా జీర్ణించుకోలేకపోతోన్నాను.

ఇప్పుడైనా మంచి ప్రదేశంలో (స్వర్గం)లో చేరి ఉంటావ్ అని ఆశిస్తున్నాను. నువ్వెప్పుడూ మాతోనే ఉంటావ్.. నీ ఆత్మకు శాంతి చేకూరాలి’ అంటూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు శేఖర్ మాస్టర్.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker