News

ఇండస్ట్రీలో విషాదం. ఆత్మహత్య చేసుకున్న ప్రముఖ సింగర్.

ప్రముఖ నటి, గాయని విజయలక్ష్మి మూడు పదుల వయసులోనే ఆమె బలవన్మరణానికి పాల్పడటం చిత్రపరిశ్రమలో చర్చనీయాంశమైంది. తన ఇంట్లోనే మల్లికా రాజ్‌పుత్ మరణించి ఉండటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంటి గదిలో ఫ్యాన్ కు ఉరివేసుకుని మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఆమె సీతాకుండ్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. అయితే ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది.

ప్రముఖ నటి, గాయని విజయలక్ష్మి అలియాస్ మల్లికా రాజ్‌పూత్ అనుమానాస్పద స్థితిలో కన్నుమూసింది. కొత్వాలీ నగర్ లోని సీతాకోండ్ ప్రాంతలో మల్లికా రాజ్‌పుత్ మంగళవారం తన గదిలో సీలింగ్ ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. 35 ఏళ్ల వయసులో తన గానంతో ఎంతోమందిని అలరించి మంచి పేరు తెచ్చుకుంది మల్లికా రాజ్‌పుత్. ఆమె మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి తరలించారు పోలీసులు. కేసు నమోదు చేసుకున్నారు.

ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాల గురించి పోలీసులు విచారణ జరుపుతున్నారు. మల్లిక మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. మల్లిక తల్లి సుమిత్రా సింగ్ మాట్లాడుతూ.. ఈ సంఘటన ఎలా జరిగిందో అర్థం కావడం లేదు.. గతి తలుపులు మూసి ఉన్నాయి.. లైట్ వెలుగుతుండటంతో అనుమానం వచ్చి తలుపులు తట్టాం… ఎంతకీ తీయకపోవడంతో కిటికీలోనుంచి చూడగా ఫ్యాన్ కి నా కూతురు వేలాడుతూ కనిపించింది.. వెంటనే నా భర్తకు, పక్కంటి వాళ్లకు ఫోన్ చేశాను.

కానీ అప్పటికే నా కూతురు చనిపోయింది అంటూ కన్నీరు పెట్టుకుంది. ఇక కొత్వాలీ పోలీస్ స్టేషన్ ఇన్ చార్జ్ మాట్లాడుతూ.. మల్లికా రాజ్‌పూత్ చనిపోయిన విధానం చూస్తుంటే అది ఆత్మహత్యల అనిపిస్తుందని తెలిపారు. పోస్ట్ మార్టం నవేదికలు వచ్చిన తర్వాత ఖచ్చితమైన కారణాలు చెప్పగలం అని అన్నారు. మల్లిక రాజ్‌పూత్ చనిపోవడంతో సెలబ్రెటీలు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker