News

బిగ్ బాస్ షోలో జరిగే చీకటి భాగోతాన్ని బయటపెట్టిన శివాజీ, ఒక్క రాత్రిలోనే..?

బిగ్ బాస్ తెలుగు 7 ముగిసింది. కంటెస్టెంట్ శివాజీ పెద్దన్నగా వ్యవహరించాడు. ఆయన ఫస్ట్ వీక్ నుండి టైటిల్ ఫేవరేట్ గా ప్రచారం పొందారు. మెచ్యూరిటీ గేమ్ ఆడుతూ ఆడియన్స్ ని మెప్పించారు. చివరి వారాల్లో సమీకరణాలు మారిపోయాయి. టైటిల్ రేసులోకి అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ దూసుకొచ్చారు. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఒక కామన్ మ్యాన్ అవ్వడమే పెద్ద విశేషం అయింది. కానీ అంతలోనే విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ సంచలనం అయింది. అనంతరం ప్రశాంత్ బెయిల్ పై బయటకు రావడంతో ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకున్నారు.

ఈ సీజన్ ఎంత పెద్ద హిట్టో .. కాంట్రవర్సీ కూడా అదే రేంజ్ లో చుట్టుముట్టింది. ఇది ఇలా ఉంటే .. బిగ్ బాస్ రియాలిటీ షో యాజమాన్యం ఇది స్క్రిప్టెడ్ కాదు జరిగిందే చూపిస్తాం అని డప్పు కొడుతూ వచ్చారు. కానీ కొందరు కంటెస్టెంట్స్ మాత్రం బిగ్ బాస్ గుట్టు బయట పెట్టేశారు. హోస్ట్ నాగార్జున గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన శివాజీ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు.

అయితే తనని లాస్ట్ నాలుగు వారాల్లో బిగ్ బాస్ వాళ్ళు కావాలనే బ్యాడ్ చేసేందుకు ప్రయత్నం చేశారని ఆరోపించారు. తాను ఎంత కష్టపడినా చిన్న ప్రశంస కూడా దక్కలేదని. కానీ కొంతమందిని మందిని ఏం చేయకపోయినా హీరో ని చేశారు. అది నేను బయటకు వచ్చాక అన్ని ఎపిసోడ్స్ చూసాను. కావాలనే చేశారని అర్ధమైంది. బాబు గారిని కూడా అడగాలనుకుంటున్నాను,

ఈ విషయంలో ఎవరితో తేల్చుకోవాలో వారితోనే తేల్చుకుంటా అంటూ కొన్ని ఇంటర్వ్యూల్లో శివాజీ వెల్లడించారు. బిగ్ బాస్ రియాలిటీ షో కాదు స్క్రిప్టెడ్ అంటూ వస్తున్న వార్తలను శివాజీ నిజం అని ప్రూవ్ చేశారు. అంతే కాదు సీజన్ 6 లో కంటెస్టెంట్ గా వచ్చిన గీతూ రాయల్ కూడా తాజా ఇంటర్వ్యూలో అదే చెప్పింది.

హోస్ట్ నాగార్జున ఎపిసోడ్స్ చూడరు .. ఆయనకు స్క్రిప్ట్ ముందే వచ్చేస్తుంది అంటూ కామెంట్స్ చేసింది. దీంతో బిగ్ బాస్ జనాలకు ఓ క్లారిటీ వచ్చేసింది. కానీ మాక్రెస్ మాత్రం ఇది స్క్రిప్ట్ కాదు రియాలిటీ షో అంటూ జనాలను పిచ్చోళ్ళని చేస్తున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ ఓటిటీ సీజన్ 2 ఫిబ్రవరి లో ప్రారంభం కానుందని టాక్ వినిపిస్తుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker