News

ఆ హీరోలిద్దరూ గేలు అంటూ టాప్ సెలబ్రెటీలకు నిద్ర లేకుండా చేస్తున్న సింగర్ సుచిత్ర.

సుచీ లీక్స్ ఇష్యూ తర్వాత ఎన్నో వివాదాల్లో చిక్కున్న సింగర్.. గత కొద్ది కాలంగా సైలెంట్ అయిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు తన గొంతు వినిపిస్తున్న ఈమె.. పలు వివాదాస్పద కామెంట్లు చేస్తూ కోలీవుడ్ ఇండస్ట్రీలో తుఫాను సృష్టిస్తుంది. పలువురు సెలబ్రెటీలపై షాకింగ్ కామెంట్స్ చేస్తూ హాట్ టాపిక్‌గా నిలుస్తుంది. అయితే తాజాగా మరోసారి సుచిత్ర వెలుగులోకి వచ్చింది. సుచీ లీక్స్ పేరుతో మరోసారి ఇండస్ట్రీపై బాంబ్ పేల్చింది.

ధనుష్, జీవీ ప్రకాష్, త్రిష వంటి వారి మీద మరోసారి సంచలన కామెంట్స్ చేసింది. ధనుష్, ఐశ్వర్యల విడాకుల గురించి మాట్లాడుతూ.. వాళ్లిద్దరూ ఒకరినొకరు మోసం చేసుకున్నారని కామెంట్స్ చేసింది. అంతేకాదు.. ధనుష్ ఒక గే అంటూ సంచలన కామెంట్స్ చేసింది. మరో హీరో, మ్యూజిక్ డైరెక్టర్ అయిన జీవీ ప్రకాష్ కుమార్ ని కూడా గే అంటూ సంచలన కామెంట్స్ చేసింది. సైంధవి, జీవీ ప్రకాష్ ల రిలేషన్ బ్రేకప్ మీద కూడా కామెంట్స్ చేసింది. జీవీ ప్రకాష్ కూడా ఒక గే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

ధనుష్, జీవీ ఇద్దరూ కూడా ఒకే గదిలో ఉంటారని.. రాత్రి మూడు గంటల వరకూ ఏం పార్టీ చేసుకుంటారంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. త్రిష మీద కూడా కామెంట్స్ చేసింది. సుచీ లీక్స్ పేరుతో విడుదల చేసిన ఫోటోలన్నీ త్రిష ఇచ్చిందని కామెంట్స్ చేసింది. ఆ ఫోటోలు వైరల్ అవ్వడంతో త్రిష ప్లేట్ పిరాయించిందని.. ఆమెను ఇంగ్లీష్ లో ఒక తిట్టు తిట్టింది. అప్పట్లో అమలాపాల్, త్రిషలతో ధనుష్ ఉన్న ప్రైవేట్ ఫోటోలు లీక్ అయిన కారణంగానే ధనుష్, ఐశ్వర్య మధ్య విబేధాలు మొదలయ్యాయని..

ఆ కారణంగానే విడిపోయారని కోలీవుడ్ లో చర్చించుకుంటారు. ఇక సుచిత్ర తన భర్తపై కూడా ఆరోపణలు చేసింది. అతనో గే అంటూ వ్యాఖ్యానించింది. అయితే సుచిత్ర వ్యాఖ్యలపై ఆమె భర్త స్పందించాడు. ఆమె మానసిక స్థితి బాలేదని.. అందుకే పిచ్చి వాగుడు వాగుతుందని.. అవేమీ పట్టించుకోవద్దని ఒక వీడియో విడుదల చేశాడు. ప్రస్తుతం సుచిత్ర చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ధనుష్, జీవీ ప్రకాష్ కుమార్ లని ఉద్దేశించి సుచిత్ర చేసిన కామెంట్స్ పై ఆ హీరోల ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker