News

తీన్మార్ మల్లన్న నటించిన ఏకైక సినిమా ఇదే. అయన కామెడీ చుస్తే పడి పడి నవ్వుకుంటారు.

సినిమా పాతది అయినా కానీ ఆ సినిమా లోని సీన్స్ యూట్యూబ్ ఎక్స్ లో పోస్ట్ చేయడం జరిగింది. అవి చూసి నెటిజెన్స్ నిజంగా ఇతను సినిమాల్లో నటించాడా అని ఆరా తీయడం మొదలుపెట్టారు. తీన్మార్ మల్లన్న నటించిన ఒకే ఒక్క సినిమా శ్రీమతి బంగారం. ఇది 2016 లో వచ్చింది ఇది ఒక కామెడీ సినిమా.

అయితే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని ఎక్కువగా విమర్శించడం కారణంగా మల్లన్నకు బాగా పాపులారిటీ వచ్చింది. ఇలా పాత్రికేయుడు, రాజకీయ నాయకుడిగానే మల్లన్న అందరికి తెలుసు కానీ.. అతను కూడా ఒక నటుడనే విషయం ఎవరికీ తెలియదు. మల్లన్న ఓ సినిమాలో నటించాడు.

ప్రస్తుతం మల్లన్న నటించిన సినిమాలోని ఓ కామెడీ సీన్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. అందులో దివంగత కమెడియన్‌ వేణుమాదవ్‌ కూడా ఉన్నారు. మల్లన్న నటించిన ఆ చిత్రం పేరు ‘శ్రీమతి బంగారం’. రాజీవ్‌ కనకాల, రిచర్డ్‌ రిషి, వేణుమాధవ్‌, హేమలతో పాటు తీన్మార్‌ మల్లన్న కూడా ఓ కీలక పాత్రలో నటించాడు. 2016లో ఈ మూవీ రిలీజై బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా బోల్తా పడింది.

అసలు ఆ సినిమా రిలీజైన విషయం కూడా జనాలకు తెలియదు. ఇక మల్లన్న అందులో నటించారనే విషయం ఎలా తెలుస్తుంది. అందుకే ఈ విషయం ఇన్నాళ్లు మరుగున పడింది. అయితే తాజాగా మల్లన్నకు సంబంధించిన కామెడీ సీన్‌ని ఎవరో కట్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో అది కాస్త వైరల్‌ అయింది.

మల్లన్నలో కూడా మంచి నటుడు ఉన్నాడే అని నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker