తిరుమలలో రోజాకు చేదు అనుభవం, అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోయిన రోజా.
![](https://www.manaarogyamkosam.com/wp-content/uploads/2024/02/rojjaa9978987-780x470.jpg)
ఏపీలో ఎన్నికల వేళ తిరుమలలో అమరావతి అనుకూల నినాదాలతో మంత్రి రోజాను అడ్డుకొనే ప్రయత్నం జరిగింది. మంత్రి రోజా తరచూ శ్రీవారిని దర్శించుకుంటారు. ఈ ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న తరువాత మంత్రి రోజా కు చేదు అనుభవం ఎదురైంది. స్వామి వారి దర్శనం చేసుకొని ఆలయం వెలుపలకు వచ్చిన రోజా వద్ద ”జై అమరావతి” అంటూ శ్రీవారి సేవకులు నినాదాలు చేశారు.
జై అమరావతి అని నినదించాలంటూ రోజాను శ్రీవారి సేవకులు కోరారు. శ్రీవారి సేవకు వచ్చి ఇదేంటంటూ మంత్రి రోజా వెళ్లిపోయారు. అయితే ఏపీ మంత్రి రోజాకు తిరుమల కొండపై నిరసన సెగ తగిలింది. ఈ ఉదయం ఆమె తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శనం చేసుకున్నారు. దర్శనానంతరం ఆమె ఆలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత… అమరావతి ప్రాంతం నుంచి వచ్చిన శ్రీవారి సేవకులు ఆమెను చుట్టుముట్టారు.
ఆమెతో సెల్ఫీలు దిగుతూనే… జై అమరావతి, ఏపీకి ఒకటే రాజధాని, వందేమాతరం అని నినాదాలు చేశారు. జై అమరావతి అని మీరు కూడా చెప్పండి మేడమ్ అని రోజాను వారు అడిగారు. అయితే, రోజా చిరునవ్వులు చిందిస్తూనే… ‘శ్రీవారి సేవకు వచ్చి ఇదేంది?’ అంటూ అక్కడి నుంచి ముందుకు సాగారు.