రెండేళ్లుగా ఆ వ్యాధితో నరకం అనుభవిస్తున్న పూనమ్ కౌర్, డాక్టర్ కూడా ఏం చెప్పారంటే..?
పూనమ్ కౌర్ నటించిన ‘వినాయకుడు’ అనే సినిమా మాత్రం పూనమ్ కు మంచి పాపులారిటీ తెచ్చిపెట్టింది. దీని తర్వాత ఇండస్ట్రీలో అవకాశాలు కనుమరగవ్వడంతో పెద్దగా సినిమాల్లో కనిపించ లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా పూనమ్ తీవ్ర ఆనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు తెలిపింది. ఈ వ్యాధి వాళ్ల ఆమె కనీసం తన దుస్తువులు కూడా ధరించి లేని పరిస్థితి ఏర్పాడిందని పేర్కొంది.
అయితే తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న పూనమ్ ఫైబ్రోమైయాల్జీయా వల్ల తానెంత బాధపడిందో, అలాగే ఈ భయంకరమైన వ్యాధి లక్షణాలను వివరంగా చెప్పుకొచ్చింది. అనంతరం దీనికి సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది పూనమ్. ఇందులో ప్రముఖ నేచురోపతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ కూడా ఉండడం గమనార్జం.’2022లో తీవ్రమైన వెన్ను నొప్పి రావడంతో ఆయుర్వేద చికిత్స కోసం కేరళ వెళ్లాను.
అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఫైబ్రోమైయాల్జీయా అనే వింత వ్యాధి ఉన్నట్లు. గత రెండేళ్లుగా ఫైబ్రోమైయాల్జీయా వ్యాధి నన్ను బాగా ఇబ్బంది పెట్టింది. ఈ వ్యాధి వల్ల కనీసం దుస్తులు కూడా వేసుకోలేని దీన స్థితికి వెళ్లాను. ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా తీవ్రమైన ఒంటి నొప్పులు. బట్టలు వేసుకుంటున్నప్పుడు కూడా తీవ్రమైన నొప్పి కలిగేది. బాడీలో మూమెంట్స్ కూడా ఉండేవి కాదు. వదులైన బట్టలు వేసుకోవాల్సి వచ్చేది.
అలా రెండేళ్లు ఈ వ్యాధి వల్ల నరకం చూశాను’ అని ఈ వీడియోలో చెప్పుకొచ్చింది పూనమ్ కౌర్. కాగా దీనికి సంబంధించిన ఫుల్ వీడియో త్వరలోనే బయటకు రానుంది.
నేచురోపతి లెజెండ్ డా.మంతెనగారిని కలవడం ఎంతో ఆనందం కలిగించింది. ఫైబ్రోమైయాల్జియా వైద్యానికి సంబంధించి ఆయన ఇచ్చిన సూచనలు అమూల్యం. మంచి మనసుగల వ్యక్తితో ఒక ఎపిసోడ్ లో పాలు పంచుకునే అవకాశం కలగడం నిజంగా నా అదృష్టం. pic.twitter.com/XiQwJvtyh7
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) February 1, 2024