టాలీవుడ్ లో విషాదం, గుండెపోటుతో నిర్మాత మృతి.
![](https://www.manaarogyamkosam.com/wp-content/uploads/2024/02/tollywood798798-780x470.jpg)
నెల్లూరు జిల్లాలోని కొరుటూరు నిర్మాత మహేశ్ సొంతూరు. పెళ్లి చేసుకోకుండానే చివరివరకు ఉండిపోయారు. ఈయన అంత్యక్రియలు చెన్నైలో సోమవారం మధ్యాహ్నం జరుగుతాయని ఆయన మేనల్లుడు టెలివిజన్ నిర్మాత, దర్శకుడు వల్లభనేని మహీధర్ చెప్పారు. పూర్తీ వివరాలోకి వెళ్తే టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత వి. మహేష్ కన్నుమూశారు.
85 ఏళ్ల మహేష్ .. శనివారం రాత్రి చెన్నైలోని తన ఇంటి బాత్ రూమ్ లో కాలుజారి కిందపడ్డారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆయన గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. వి. మహేష్ అప్పట్లో మంచి మంచి తెలుగు సినిమాలను నిర్మించారు.
![](https://www.manaarogyamkosam.com/wp-content/uploads/2024/02/8564987456.png)
1975లో మాతృమూర్తిసినిమా ద్వారా మహేష్ నిర్మాతగా పరిచయం అయ్యారు. ఈ సినిమా ఆయనకు మంచి పేరునే తీసుకొచ్చి పెట్టింది. ఇక ఈ చిత్రం తరువాత ఎన్టీఆర్ హీరోగా మనుషులంతా ఒక్కటే, మహాపురుషుడు సినిమాలు తీశారు. ఆ తరువాత చిరంజీవి హీరో సింహపురి సింహం సినిమాకు తెరకెక్కించారు. ఇక సుమన్ నటించిన ముసుగు దొంగ సినిమాను కూడా ఈయనే నిర్మించారు.
సినిమాలు మాత్రమే కాకుండా పలు సీరియల్స్ కు కూడా రైటర్ మరియు నిర్మాతగా వ్యవహరించారు. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్లో ప్రసారమైన హరి భక్తుల కథలు సీరియల్కి ప్రొడ్యూసర్, రైటర్గా పనిచేశారు. ఈ సీరియల్ కు ఎంతోమంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు.