వేప పుల్లతో పళ్లు తోముకుంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?
![](https://www.manaarogyamkosam.com/wp-content/uploads/2023/06/vepapulla465312-780x470.jpg)
పూర్వ కాలంలో అందరు వేప పుల్లలతోనే దంతాలను శుభ్రం చేసుకునే వారు. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న టూత్ బ్రష్ , టూత్ పేస్ట్ కంటే వేప పుల్ల ఎంతో మేలైనది. వేప పుల్లతో దంతాలను శుభ్ర చేసుకోవడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. దంతాల మధ్య, చిగుళ్లపై ఉండే సూక్ష్మ జీవులను చంపడంలో వేప పుల్ల ఎంతో సహాయపడుతుంది. అయితే దంతాలు చాలా మందిలో పటిష్టంగా ఉన్నప్పటికీ సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లరంగు మారుతుంటాయి.
పసుపు పచ్చగా తయారవుతాయి. దీంతో నలుగురిలో హాయిగా నవ్వాలన్నా మొహమాటపడే పరిస్థితికి వస్తారు. అయితే. అందుకే, ఎప్పుడూ పళ్లను శుభ్రంగా ఉంచుకోవాలి. చాలా మంది వారి దంత సంరక్షణ కోసం రెగ్యులర్ గా డెంటిస్ట్ ను కలుస్తుంటారు. రోజులో రెండు సార్లు బ్రెష్ చేసుకోవడం చేస్తుంటారు. అందుకే వారి దంతాలు తెల్ల గా మిళమిళలాడుతూ ఆరోగ్యంగా ఉంటాయి. చిగుళ్ల నొప్పి, రక్తం రావడం..దంత నొప్పులు , చిగుళ్ల నొప్పి, రక్తం రావడం, నోటి దుర్వాసన ఇలా అనేక రకాల సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి.
అయితే పూర్వకాలంలో మన పెద్దలు ఎటువంటి టూత్ పేస్ట్ లు వాడకుండానే, వారి దంతాలు ఎంతో గట్టిగా ఉండేవి. మనం మాత్రం దంత సమస్యలతో ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే వేప పుల్లలు ఈ బాధలు అన్నీ తొలగిస్తాయంట. సహజమైన టూత్ పేస్టులు..అప్పట్లో దంతాలకు వేప పుల్లలు , ఉత్తరేణి పుల్లలు, ఉప్పు, ఇటుక పెల్ల పౌడర్, బొగ్గు అప్పటి సహజమైన టూత్ పేస్టులు. అంతేకాకుండా వేప పుల్లతో దంతాలను శుభ్రం చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి.
ఈ వేప పుల్లలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకని దీనితో రోజు దంతాలు తోముకుంటే చిగుళ్లు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాకుండా నోటి దుర్వాసన కూడా నివారిస్తుందని చెప్పవచ్చు. అయితే ముందుగా ఈ వేప పుల్ల ని బాగా నమిలి, ఆ రసాన్ని పిక్కిలి పట్టాలి. తర్వాత పండ్లను తోమాలి.. ఇలా ప్రతిరోజూ చేస్తే నోటి దుర్వాసన పోతుంది. సూక్ష్మ క్రిములు చేరకుండా రక్షణ కల్పిస్తుంది. ఇక దంత చిగుళ్ల వాపు, చిగుళ్ల నుంచి రక్తం కారడం వంటి సమస్యలను తొలగించాలంటే, రోజు వేపాకులతో శుభ్రం చేసుకుంటే, వేపలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ , యాంటి మైక్రోబియల్ గుణాలు నోటిలోని బ్యాక్టీరియా ను నాశనం చేస్తాయి.
తద్వారా ఆరోగ్యంగా ఉంటాయి దంతాలు. ఇలా చేయడం ద్వారా చిగుళ్ళవాపు సహజంగానే తగ్గుతాయి. వేప పుల్లలో యాంటీ ఫంగల్, యాంటీ వైరస్ గుణాలు అధికంగా ఉంటాయి. దీంతో రోజు 15 నిమిషాల పాటు పళ్ళు తోముకుంటే నోటి దంతాలు, చిగుళ్ళ సమస్యలు తగ్గుతాయి. రోజు వేప పుల్ల, బొగ్గు ఉప్పుతో దంతాలు శుభ్రం చేస్తే దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.