Vishal: విశాల్-సాయి ధన్సికల పెళ్లి వాయిదా..! మళ్ళీ ఏం జరిగిందో తెలుసా..?

Vishal: విశాల్-సాయి ధన్సికల పెళ్లి వాయిదా..! మళ్ళీ ఏం జరిగిందో తెలుసా..?
Vishal: విశాల్కు గతంలో హీరోయిన్ అనీషాతో నిశ్చితార్థం జరిగింది. వీరు పెళ్లి పీటలు ఎక్కడానికి ముందే విడిపోయారు. ఆ తర్వాత కొంతకాలానికి హీరోయిన్ సాయి ధన్సికతో ప్రేమలో పడ్డారు. అయితే అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఉంటే మరికొన్ని రోజుల్లో పెళ్లిపీటలెక్కేవాడు కోలీవుడ్ యాక్షన్ హీరో విశాల్. హీరోయిన్ సాయి ధన్సికతో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టేవాడు.

అయితే ఈ శుభకార్యానికి మరి కొంత సమయం పట్టేలా ఉందని తెలు్తోంది. కొన్ని రోజుల క్రితం ఓ సినిమా ఈవెంట్ లో హీరో విశాల్ హీరోయిన్ సాయి ధన్సికను తన ప్రేయసిగా పరిచయం చేశాడు. ఆగస్టు 29న పెళ్లి బంధంలోకి అడుగుపెడుతున్నామంటూ వెడ్డింగ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు. దీంతో విశాల్ అభిమానులు కూడా తెగ సంతోష పడ్డారు.
Also Read: కేంద్రం సంచలన నిర్ణయం, వెంటనే ఇలా చేయకపోతే మీ పిల్లల ఆధార్ రద్దవుతుంది.
అయితే ఇప్పుడు ఈ పెళ్లి వాయిదా పడనుందంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై విశాల్ కూడా స్పందించాడు. ‘ సాయి ధన్సికతో నా పెళ్లి నడిగరం సంఘం భవంతిలోనే జరుగుతుంది. అది ఎప్పుడు పూర్తయితే అప్పుడే మా వివాహానికి ఏర్పాట్లు చేసుకుంటాం. నడిగర్ సంఘం భవనం కోసం తొమ్మిదేళ్లుగా ఎదురుచూశాను.
Also Read: కోట శ్రీనివాసరావు ఆస్తులు విలువ తెలుసా..?
ఇప్పుడు ఇంకో రెండు నెలలు ఆగలేనా? నడిగర్ సంఘంలో జరగబోయే మొదటి పెళ్లి నాదే. అందులో డౌటేమీ లేదు. ఇప్పటికే బుకింగ్ కూడా చేసుకున్నాను. ప్రస్తుతం ఆ భవంతి మూడో అంతస్తులో పెళ్లి మందిరాన్ని నిర్మిస్తున్నారు’ అని విశాల్ చెప్పుకొచ్చాడు. కాగా నడిగర్ సంఘం (దక్షిణ భారత కళాకారుల సంఘం) భవన నిర్మాణం ఎన్నో ఏళ్లుగా జరుగుతోది.