News

కరోనా భయంతో 217 సార్లు వ్యాక్సిన్ వేయించుకున్న వ్యక్తి, ఎప్పుడు అతను ఎలా ఉన్నాడో తెలుసా..?

సాధారణంగా ప్రజలకు రెండు డోస్‌లు మాత్రమే వ్యాక్సిన్‌ ను ఇచ్చారు. అతి కొద్దీ మందికి మాత్రమే బస్టర్ డోసు ఇచ్చారు. అయితే కొంతమంది 10-15 డోస్‌లు తీసుకున్న సందర్భాలు కూడా వెలుగులోకి వచ్చాయి అయితే ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ కు సంబంధించిన ఓ కేసు చర్చనీయాంశమైంది. అయితే జర్మనీకి చెందిన ఓ వ్యక్తి కేవలం 29 నెలల వ్యవధిలో 217 సార్లు కోవిడ్ టీకా తీసుకున్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది.

వైద్యుల సలహాలను పట్టించుకోకుండా ఓ 62 సంవత్సరాల వ్యక్తి వరుసగా టీకాలు తీసుకున్నాడట. అన్ని సార్లు టీకాలు తీసుకున్నా అతడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడు. తాజాగా ఆ విషయం బయటపడడంతో ఎర్లాంజెన్-న్యూరెంబర్గ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు అతడి నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు చేస్తున్నారు. టీకాలకు రోగనిరోధక వ్యవస్థ ఎలా ప్రతిస్పందిస్తోందనే విషయాన్ని నిర్ధారించడానికి ఆ వ్యక్తి రక్తాన్ని, లాలాజలాన్ని సేకరించారు.

పదేపదే టీకాలు తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థలోని కొన్ని కణాలు క్రియాశీలతను కోల్పోతాయి. కానీ ఆశ్చర్యకరంగా ఈ జర్మన్ వ్యక్తిలో అలాంటి లక్షణాలేవీ కనిపించలేదని పరిశోధకులు గుర్తించారు. అలాగే ఆయన ఎప్పుడూ కోవిడ్ బారినపడిన లక్షణాలను కూడా గుర్తించలేదు.

ఇంకో విశేషమేమిటంటే ఇన్ని సార్లు టీకాలు తీసుకున్నా ఆ వ్యక్తి ఒక్కసారి కూడా జ్వరం బారిన పడలేదు. కాగా, 217 సార్లు టీకాలు ఇచ్చారనే విషయంపై మాగ్డెబర్గ్ నగర పబ్లిక్ ప్రాసిక్యూటర్ విచారణ ప్రారంభించారు. ఇప్పటివరకు అతడిపై అభియోగాలేవీ నమోదు చేయలేదు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker