మందు బాబులరా జాగర్త, మీరు ఇలా చేసారంటే.. 6 నెలలు జైలుకే.
తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రెండేళ్లకు ఒకసారి మద్యం ధరలు పెంచడం సాధారణంగా జరిగేదే. అలాగే ఈసారి కూడా మద్యం ధరలు పెంచనున్నట్లు తెలుస్తోంది. రెండేళ్ల క్రితం కేసీఆర్ ప్రభుత్వం మద్యం ధరలు పెంచిన విషయం తెలిసిందే. ఇప్పుడు రేవంత్ సర్కారు మద్య ధరల పెంపుపై సమాలోచనలు చెస్తున్నట్లు సమాచారం.
అయితే మేము ఎలా పడితే.. అలా తాగుతాం అంటే కుదరదు అంటూ మందు బాబులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు తెలంగాణ పోలీసులు. ఇక నుంచి అలా మద్యం సేవిస్తే.. 6 నెలల జైలు శిక్ష తప్పదు అంటూ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ ను షేర్ చేసింది. దాంతో మందు బాబులు అలెర్ట్ కావాల్సిన సమయం వచ్చిందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
మందు బాబులకు బిగ్ అలెర్ట్.. ఇక నుంచి బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ.. పోలీసులకు చిక్కారో ఇక మీ సంగతి అంతే. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చట్టరిత్య నేరం.. ఇందుకు 6 నెలల జైలు శిక్ష విధిస్తామని తెలంగాణ పోలీసులు హెచ్చరించారు. ఇందుకు సంబంధించి ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ లో ఈ విధంగా రాసుకొచ్చారు. “బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం వల్ల ప్రజలకు, స్థానికులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది.
అదీకాక బహిరంగ మద్యపానం చట్టరీత్యా నేరం. రోడ్లపై, ఖాళీ ప్రదేశాల్లో మందు తాగితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ నేరానికి 6 నెలల వరకు జైలు శిక్ష పడుతుంది” అంటూ పోస్ట్ లో రాసుకొచ్చింది. ఇలాంటి ఘటనలపై 100కు డయల్ చేయాలని సూచించింది.
బహిరంగ మధ్యపానం చట్టరీత్యా నేరం. బహిరంగప్రదేశాల్లో మద్యం సేవించటం ప్రజలకు, స్థానికులకు ఇబ్బంది కలిగిస్తుంది. ఇలా రోడ్లపై కానీ, ఖాళీ ప్రదేశాల్లో కానీ మద్యం సేవించిన వారిపై కఠినచర్యలు తీసుకోబడతాయి. ఈ నేరానికి 6 నెలల వరకు జైలుశిక్ష పడుతుంది.#ConsumingAlcohol #PublicPlaces #Dial100 pic.twitter.com/xeI5DR5e0O
— Telangana Police (@TelanganaCOPs) June 14, 2024