Life Style

మెత్తటి పరుపులపై నిద్రపొతే భవిష్యత్తులో ఏం జరుగుతుందో చుడండి.

మెత్తటి పరుపులపై నిద్రపోతే వెన్ను నొప్పి తగ్గటమే కాక నిద్రను కూడా అది మెరుగు పరుస్తుందని ఈ అధ్యయనం తెలుపుతోంది. గట్టిపరుపులపై పడుకోవడమే మేలనే జనాభిప్రాయానికి భిన్నంగా ఈ నివేదిక కొత్త విషయాన్ని పేర్కొంది. గట్టిపరుపులపై పడుకుంటే వీపు నొప్పిని అది ఇంకా తీవ్రతరం చేస్తుందని ఈ అధ్యయన బృందం నేత డాక్టర్ కిమ్ బెర్గోల్డ్‌ట్ చెప్పారు. అయితే ఈ కాలంలో ప్రజలు సౌకర్యాలకు అలవాటుపడ్డారు. సుఖంగా ఉండేందుకు చూస్తున్నారు.

ఇక నిద్ర పోవడానికి మెత్తగా ఉండే పరుపులను చూసుకుంటున్నారు. సుఖంగా నిద్రపోయేందుకు పరుపుల మీద పడుకుంటున్నారు. కానీ నిద్రించేందుకు పరుపులు ఉపయోగించడం వలన.. మనం అనేక సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆరోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు. పరుపుల తయారీలో ఫార్మల్డ్ హైడ్, బెంజీన్, నాఫ్తలీన్ లాంటివి ఎక్కువగా ఉపయోగిస్తారు.

వీటి కారణంగా కళ్లు, ఊపిరితిత్తులు, చర్మానికి సంబంధించిన సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. అలర్జీలు, దురదలు, ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉంది. నాఫ్తలీన్ కారణంగా మూత్రపిండాలు దెబ్బతినే అవకాశం ఉంది. నాఫ్తలీన్ అనే రసాయనం కారణంగా పొత్తి కడుపులో నొప్పి ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెప్పేమాట. బెంజీన్ కారణంగా కడుపులో అల్సర్ వచ్చే అవకాశం ఉంది. దీనివలన ఆరోగ్యంగా ఉండే కణాలు క్యాన్సర్ కణాలు మారే ఛాన్స్ ఉంది.

స్పాంజి పరుపుల ద్వారా వేడి ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఈ కారణంగా మన మీద చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. పరుపుల్లో ఉండే కుషనింగ్ కారణంగా వాటి మీద పడుకుంటే.. మన శరీర ఆకృతి మారుతుంది. దీనుల్ల డిస్క్ లపై ఒత్తిడి పడుతుంది. డిస్క్ లు పక్కకు జరగడం ఉంటుంది. డిస్క్ లు పక్కకు జరిగితే.. నరాలు, వెన్నుపాముపై ఒత్తిడి పడుతుంది. దూదితో తయారు చేసే పరుపులకు ప్రాధాన్యత ఇవ్వండి.

అయితే నేలపై పడుకుంటే చాలా మంచిది. మెుదట కాస్త ఇబ్బంది ఉన్నా.. అలవాటు అయితే.. మంచి నిద్ర వస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. నేలప నిద్రిస్తే.. ఒత్తిడి తగ్గుతుంది. మెంటల్ హెల్త్ కండీషన్ బాగుంటుంది. వెన్నునొప్పితో బాధపడే వాళ్లు.. నేలపై పడుకుంటే ఆరోగ్యం. శరీరాకృతి కూడా మెరుగవుతుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker