News

మోదీ ఒడిలో ఆడుకుంటున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా..?

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్ధుల కోసం స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ రంగంలోకి దిగడంతో మూడు పార్టీల శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపించింది. బుధవారం విజయవాడలో మోదీ టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తో కలిసి రోడ్ షోలో పాల్గొన్నారు. అయితే తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు నాలుగో దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. మే 13న పోలింగ్ పోలింగ్ జరగనుంది.

ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ నిన్న కరీంనగర్, వరంగల్ లోక్ సభ పరిధిలో నిర్వహించిన ప్రచార సభలో పాల్గొన్నారు. బిజెపి క్యాడర్ లో జోష్ నింపుతూ… కమలంపువ్వు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరుతూ ప్రధాని ప్రచారం సాగింది. మొదట వేములవాడలో జరిగిన బిజెపి ప్రచార సభలో పాల్గొన్న ప్రధాని రోడ్డుమార్గంలోనే వరంగల్ కు బయలుదేరారు. ఈ క్రమంలోనే మోదీని చూసేందుకు ప్రజలు రోడ్డుకు ఇరువైపులా చేరారు.

ఇలా లక్ష్మీపురంలో ఓ తల్లి తన చిన్నారి బిడ్డను తీసుకుని ప్రధానిని చూసేందుకు రోడ్డుపైకి వచ్చింది. ఎండను సైతం లెక్కచేయకుండా బిడ్డను తీసుకువచ్చిన ఆమెకు జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకం మిగిలింది. బిడ్డను ఎత్తుకుని తనను చూసేందుకు వచ్చిన ఆ తల్లిని చూసిన ప్రధాని మోదీ వెంటనే కాన్వాయ్ ఆపారు. తన కారుదిగి ఆ తల్లి వద్దకు వెళ్లి ఆ బుడ్డోడిని చేతుల్లోకి తీసుకున్నారు. చిన్నారిని ఎత్తుకుని కొద్దిసేపు ప్రేమగా ఆడించారు. ఆ బుడ్డోడు కూడా ప్రధానిని చూస్తూ పాలబుగ్గల నవ్వులు చిందించాడు.

ఇలా మోదీని దూరంనుండి చూస్తే చాలని ఆయన అభిమానించేవారు, కలిస్తే చాలని బిజెపి నాయకులు కోరుకుంటారు…. అలాంటిది ఈ పిల్లాడికి మాత్రం అతడి ఒడిలో కూర్చుని ఆటాడుకునే అరుదైన అవకాశం దక్కింది. అతడు చాలా అదృష్టవంతుడని బిజెపి శ్రేణులు అంటున్నాయి. అయితే చిన్నారిని లాలిస్తున్న ఫోటోను స్వయంగా ప్రధాని మోదీ సోషల్ మీడియా ద్వారా ప్రజలతో పంచుకున్నారు. ”వరంగల్ లో ప్రచార ర్యాలీకు వెళ్తుండగా లక్ష్మీపురం గ్రామంలో నా యువ మిత్రుడిని కలిశాను” అంటూ బుడ్డోడితో కలిసున్న ఫోటోను జతచేస్తూ ప్రధాని ట్వీట్ చేసారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker