News

ఒడిశా ఘోర రైలు ప్రమాదం, ఎలా జరిగిందో తెలుసా..?

బెంగళూరు నుంచి పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని హావ్ డాకు వెళుతున్న బెంగళూరు-హావ్ డా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ బాలేశ్వర్ జిల్లాలోని బహానగా బజార్ స్టేషన్ వద్ద పట్టాలు తప్పింది. దీంతో రైలు బోగీలు ట్రాక్ పై పడ్డాయి. అప్పుడే వచ్చిన షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొంది. అయితే కొంకణ్ రైల్వే పరిధిలో 100 శాతం విద్యుదీకరణ పూర్తైందని రెండు నెలల క్రితం రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అంతే కాకుండా రాష్ట్రంలో డంబ్లింగ్, ట్రంబ్లింగ్‭ పెద్ద ఎత్తున కొనసాగడమే కాకుండా సిగ్నలింగ్ వ్యవస్థ, సాంకేతికత చాలా పెరిగిందని స్వయంగా కేంద్రరైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.

అంతలోనే ఇంత పెద్ద ప్రమాదం జరగడం శోచనీయం. విపక్షాల నుంచి సహజంగానే విమర్శలు వస్తున్నప్పటికీ మూడు రైళ్లు ఢీకొనడంపై ప్రజల నుంచి సైతం తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏయే రైళ్లు ఢీకొన్నాయి? ఎక్కడ ఢీకొన్నాయి? ప్రమాదంలో బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ సహా మరో గూడ్స్ రైలు ఉన్నాయి. ఇందులో మొదట కోరమాండల్ రైలు పట్టాలు తప్పగా మిగిలిన రెండు రైళ్లు ఆ రైలును ఢీకొట్టాయి. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ కోల్‌కతా సమీపంలోని షాలిమార్ స్టేషన్ నుండి చెన్నై సెంట్రల్ స్టేషన్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదం కోల్‌కతాకు దక్షిణాన 250 కిలోమీటర్లు, భువనేశ్వర్‌కు ఉత్తరాన 170 కిలోమీటర్ల దూరంలో బాలాసోర్ జిల్లాలోని బహంగా బజార్ స్టేషన్ సమీపంలో రాత్రి 7 గంటల ప్రాంతంలో జరిగింది. ప్రమాదం ఎలా జరిగింది.. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, 12841 షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ షాలిమార్ స్టేషన్ నుంచి మధ్యాహ్నం 3:20 గంటలకు బయలుదేరి సాయంత్రం 6:30 గంటలకు ఒడిశాలోని బాలాసోర్ చేరుకుంది. సుమారు రాత్రి 7:20 గంటలకు బాలేశ్వర్ సమీపంలో రైలు 10 నుంచి 12 కోచ్‌లు పట్టాలు తప్పి ఎదురుగా ఉన్న ట్రాక్‌పై పడిపోయాయి. అనంతరం, డౌన్‌లైన్‌లో ప్రయాణిస్తున్న 12864 బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, పట్టాలు తప్పిన షాలిమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు కోచ్‌లను ఢీకొట్టింది.

దీంతో కోరమాండల్ రైలుకు చెందిన 15 బోగీలు పట్టాలు తప్పాయి. అయితే ఈ దారుణం ఇంతటితో ఆగలేదు. అప్పటికే రెండు రైళ్లు ప్రమాదంలో ఉండగా.. పక్కనున్న ట్రాక్ మీద నుంచి దూసుకువచ్చిన గూడ్స్ రైలు ఒకటి ట్రాక్ మీద ఉన్న కోరమాండల్ కోచ్‭లను ఢీకొట్టింది. అప్పటికే ప్రమాదానికి గురైన రెండు ప్యాసింజర్ రైళ్లను గూడ్స్ రైలు సైతం ఢీకొట్టడంతో మరింత తీవ్రత పెరిగింది. కొరమాండల్ రైలు కోల్‭కతాలోని షాలిమర్ నుంచి చైన్నై వెళ్తోంది. బెంగళూరు నుంచి హౌరాకు సూపర్‌ఫాస్ట్‌ రైలు వెళ్తోంది. గూడ్స్ రైలు వెళ్లే మార్గం ఇంకా వెల్లడి కాలేదు.

సహాయక చర్యలు.. పట్టాలు తప్పిన కోచ్‌లలో మృతదేహాలు ఏవీ లేవని, అయితే రైళ్ల కింద చిక్కుకున్న వారిని గుర్తించేందుకు రాత్రిపూట సహాయక చర్యలు కొనసాగుతాయని ఒడిశా డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్ సుధాన్షు సారంగి తెలిపారు. ఇక సహాయక చర్యల కోసం 200 అంబులెన్సులు, 50 బస్సులు, 45 మొబైల్ హెల్త్ యూనిట్లు ప్రమాద స్థలానికి పంపినట్లు ఆయన పేర్కొన్నారు. మొత్తం 1,200 మంది సిబ్బందితో కూడిన బృందం సహాయక చర్యల్లో ఉందట. క్షతగాత్రులను బాలాసోర్‌లోని ఆసుపత్రి, కటక్‌లోని ఎస్‌సీబీ మెడికల్ కాలేజీకి తరలిస్తున్నారు. అనేక మంది వ్యక్తులు పట్టాలు తప్పిన కోచ్‌ల కింద చిక్కుకుపోయారు. స్థానికులు వారిని రక్షించడానికి అత్యవసర సేవల సిబ్బందికి సహాయం చేస్తున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker