News

రాజకీయాల్లోకి పల్లవి ప్రశాంత్. ఆ పార్లమెంట్ నుంచి పోటి చెయ్యబోతున్నా రైతుబిడ్డ.

సామాన్యుడు తలచుకుంటే ఏదైనా చేయవచ్చు అని నిరూపించాడు. భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. కాగా ఇప్పుడు ఏకంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడట. స్వయంగాపల్లవి ప్రశాంత్ ఈ విషయాన్నివెల్లడించాడు. దాంతో చర్చ మొదలైంది. అయితే తాజాగా ఓ సినిమా ఈవెంట్ కు అటెండ్ అయినా పల్లవి ప్రశాంత్ .. అక్కడ మాట్లాడుతూ .. “మనల్ని మనం నమ్ముకోవాలి. అలాగే దేవుడిని నమ్మిన వాళ్ళు ఎప్పుడు చెడిపోరు. ఆ భగవంతుడే కాపాడతాడు.

ఏ కష్టంలో ఉన్నా దేవుడే దిక్కనుకుంటే ఆయనే ఎదో ఒక రూపంలో వచ్చి మనల్ని కాపాడతాడు. మన వెన్నంటే ఉంటాడు, మనం ముందుకు వెళ్తుంటే ఎన్నో దెబ్బలు తాకుతూ ఉంటాయి. ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా సరే గట్టిగా నిలబడాలి. నేను అలాగే నిలబడ్డాను. అందుకే మీ ముందు ఇలా నిలబడ్డాను. ఇంకా ఎన్ని ఎదురుదెబ్బలు తాకినా సరే అసలు భయపడను, వెనక్కు వెళ్ళను.. ఇలాగె నిలబడతాను. రైతు బిడ్డ అనుకుంటే ఏదైనా సాధిస్తాడు.” అంటూ చెప్పుకొచ్చాడు పల్లవి ప్రశాంత్.

ఈలోపు శివాజీ పార్లమెంట్ కు కూడా వెళ్తాడు అని చెప్పగా.. దానికి పల్లవి ప్రశాంత్ స్పందిస్తూ.. “మీ అందరి ఆశీస్సులు ఉంటే అది కూడా జరుగుతుంది. యువత మేలుకోవాలి, యువత ముందడుగు వేయాలి. అప్పుడే సమాజం బాగుపడుతుంది.” అంటూ వ్యాఖ్యానించాడు. దీనితో పల్లవి ప్రశాంత్ మాటలను బట్టి చూస్తే.. ఒకవేళ ప్రజలు కనుక అతనికి సపోర్ట్ చేస్తే.. రాజకీయాల్లోకి కూడా పల్లవి ప్రశాంత్ అడుగు పెట్టి.. తన సత్తా చూపించే అవకావం లేకపోలేదు.

ఇక ఈ మాటలను చూసిన నెటిజన్లకు.. పల్లవి ప్రశాంత్ త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నాడా ! అనే సందేహాలు మొదలయ్యాయి. మరి, పల్లవి ప్రశాంత్ తాజాగా పాలిటిక్స్ గురించి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker