News

జయం మూవీలో సదా చెల్లెలు గుర్తుందా..! ఇప్పుడు ఎలా ఉందో చూశారా..?

జయం సినిమా 2002 వ సంవత్సరం జూన్ 14న ఈ మూవీ రిలీజ్ అయ్యి బంపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాను తేజ సొంత బ్యానర్‌లో నిర్మించారు. ‘చిత్రం మూవీస్’ బ్యానర్‌లో వచ్చిన ఈ చిత్రంలో నితిన్ ఎంతో అమాయకంగా నటించారు. సదా కూడా క్యూట్ లుక్స్‌తో అదరగొట్టింది. అయితే లవ్, ఎమోషన్, కామెడీ, యాక్షన్ కలగలిపి దర్శకుడు తేజ అద్భుతంగా తెరకెక్కించాడు. అనేక సెంటర్స్ లో జయం మూవీ నిర్విరామంగా ప్రదర్శించబడింది. సదా ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. ఆమె చెప్పిన ‘వెళ్ళవయ్యా వెళ్ళు’ అనే డైలాగ్ పిచ్చ పాప్యులర్.

సుమన్ శెట్టి, షకీలా, ధర్మవరపు సుబ్రహ్మణ్యంల కామెడీ అలరిస్తుంది. గోపీచంద్ విలనిజం ఓ రేంజ్ లో పేలింది. కరుడుగట్టిన విలన్ గా గోపీచంద్ ఆహార్యం, నటన మెప్పిస్తాయి. ఇక నితిన్ ఇన్నోసెంట్ విలేజ్ కుర్రాడి పాత్రలో ఆకట్టుకున్నాడు. ఆర్ఫీ పట్నాయక్ సాంగ్స్ సినిమాకు మరో హైలెట్. కాగా జయం మూవీలో సదా చెల్లి పాత్ర చేసిన అమ్మాయి మీకు గుర్తే ఉంటుంది. కళ్ళజోడు పెట్టుకుని ఎప్పుడూ అక్క వెంటే ఉండే పాత్రలో యంగ్ గర్ల్ ఆకట్టుకుంది. ఆ పాత్ర చేసిన అమ్మాయిని ఇప్పుడు చూస్తే మీరు షాక్ అవుతారు.

కారణం ఆమెకు పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారు. జయం మూవీలో సదా చెల్లెలు పాత్ర చేసిన చిన్నారి పేరు యామిని శ్వేత నాయుడు. జయం మూవీ బ్లాక్ బస్టర్ అయినప్పటికీ శ్వేత నాయుడు ఎక్కువగా సినిమాలు చేయలేదు. ఆమె చదువు మీద దృష్ఠి పెట్టి సిల్వర్ స్క్రీన్ కి దూరం అయ్యింది. చదువు పూర్తి అయ్యాక యంగ్ ఏజ్ లోనే వివాహం చేసుకుంది. భర్తతో పాటు యామిని శ్వేతా నాయుడు విదేశాల్లో సెటిల్ అయినట్లు సమాచారం. ఈమెకు ఒక పాప ఉంది. సిల్వర్ స్క్రీన్ కి దూరమైనా కూడా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కి అందుబాటులోనే ఉంటుంది.

ఆమె ఇంస్టాగ్రామ్ లో తరచుగా పోస్ట్స్ పెడుతూ ఉంటారు. తన ఫొటోలతో పాటు ఫ్యామిలీ ఫోటోలు షేర్ చేస్తుంది. యామిని శ్వేతా నాయుడు ఫోటోలపై ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తుంటారు. విడ్డూరం ఏమిటంటే… జయం మూవీ హీరోయిన్ సదా ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఆమె చెల్లి పాత్ర చేసిన శ్వేతా నాయుడు మాత్రం పెళ్లి చేసుకుని పిల్లలను కూడా కనేసింది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker