సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తానని ఆ స్టార్ డైరెక్టర్ మోసం చేశాడు : సాక్షి
సాక్షి అగర్వాల్ ని ఆమె అభిమానులు కవార్చి అళగి అని పిలుస్తారు. ఇన్స్టాగ్రామ్లో సాక్షి చాలా యాక్టివ్ గా ఉంటుంది. నటి సాక్షి అగర్వాల్ సినిమాల్లోకి రాకముందు ఓ పెద్ద కంపెనీలో బిజినెస్ కన్సల్టెంట్గా జాబ్ చేశారు. నటించాలనే కోరికతో లక్షల జీతం వదిలి మలయాళ మూవీ ఒరైరం కోనల్లో సహాయ పాత్రలో నటించి సినీ రంగ ప్రవేశం చేసింది. 2018లో ప్రముఖ నటీనటులతో పలు చిత్రాల్లో నటించి ఎంతో పేరు తెచ్చుకున్నారు.
అయితే తాజాగా నటి సాక్షి అగర్వాల్ కూడా అలానే డైరెక్టర్ అట్లీపై విమర్శలు చేసింది. కోలీవుడ్ నటి సాక్షి అగర్వాల్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇక ఆమె మోడల్ గా చేసే రోజుల్లో రాజారాణి సినిమా ఆఫర్ వచ్చిందంట. ఆర్య, నయనతార జంటగా నటించిన ఈ సినిమాకు అట్లీ దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమా లో సెకండ్ హీరోయిన్ అని చెప్పి సాక్షి అగర్వాల్ ను అప్రోచ్ అయ్యారట.
ఆర్య హీరో అవడం, సెకండ్ హీరోయిన్ అనడంతో ఆమె కూడా ఓకే చెప్పిందంట. “రాజారాణి సినిమా షూటింగ్ కు వెళ్లాను. నా మీద చాలా సీన్స్ చేశారు. ముఖ్యంగా షాపింగ్ మాల్ లో సీన్స్ తో పాటు ఇంకొన్నీ సీన్స్ కూడా షూట్ చేశారు. ఇక రిలీజ్ తరువాత నా సీన్స్ మొత్తం తీసేశారు. థియేటర్ లో నేను చూసి షాక్ అయ్యాను.
అదే సమయంలో దీని గురించి నేను దర్శకుడు అట్లీతో మాట్లాడి ఉండుంటే బాగుండేది. ఆయనతో మాట్లాడకపోవడం నా తప్పు అయింది. హీరోయిన్ ఛాన్స్ ఇస్తానని అట్లీ మోసం చేశాడు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.