News

సల్మాన్ ఖాన్ ఇంట్లో తీవ్ర విషాదం, ఆమెపై ఎమోషనల్ అయిన స్టార్ హీరో.

సల్మాన్ కు చాలా ఇష్టమైన పెద్దావిడ తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో ఆమె ఫోటో షేర్ చేస్తూ తన సోషల్ మీడియా ఖాతాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు సల్మాన్. అద్దు అని పిలిచే పద్దావిడ చనిపోయినట్టు సల్మాన్ పెట్టిన పోస్ట్ ను బట్టి అర్థమవుతోంది. ”నేను ఎదుగుతున్న క్రమంలో మీరు అందించిన ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు. నా ప్రియమైన అద్దు శాంతితో విశ్రాంతి తీసుకో” అని పేర్కొన్నారు సల్మాన్ ఖాన్.

అయితే సల్మాన్ ఖాన్ అద్దు అని పిలిచే పద్దావిడ చనిపోయినట్టు తెలుస్తోంది. అద్దు అని సంభోదిస్తూ… ఆమె చనిపోయిందని, రెస్ట్ ఇన్ పీస్ అంటూ.. ఇన్ స్టాలో పోస్ట్ శేర్ చేశారు సల్మాన్ ఖాన్. ఆమె ఫొటోని పోస్ట్ చేసిన ఆయన చాలా ఎమోషనల్ అయినట్టు తెలుస్తోంది. దీంతో అసలు ఈమె ఎవరా అని ఫ్యాన్స్ ఆరాలు తీయ్యడం స్టార్ట్ చేశారు.

కొందరేమో సల్మాన్ చిన్నతనంలోని కేర్ టేకర్ ఈమె అని అంటున్నారు. కాదు సల్మాన్ ఖాన్ ఆంటీ ఈవిడ అని మరికొంత మంది అంటున్నారు. ఇక కోట్లాది అభిమానులను సంపాదించుకున్న సల్మాన్ ఖన్.. తాజాగా కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ మూవీతో ప్రేక్షకుల్ని పలకరించాడు. కాని ఈసినిమా తీవ్రంగా నిరాశపరిచింది.

హిందీలో కాస్త పర్వాలేదు అనిపించినా..? మిగతా భాషల్లో దారుణ పరాజయం చూసింది. మల్టీ లాంగ్వేజ్ లో ఈసినిమా రిలీజ్ చేసినా..మల్టీ స్టార్స్ తో సందడి చేసినా.. ఈ ఫార్ములు ఏమాత్రం వర్కౌట్ అవ్వలేదు. దాంతో సల్మాన్ టీమ్ తీవ్ర నిరాశలో మునిగిపోయింది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈమూవీలో సౌత్ స్టార్ హీరో వెంకటేష్ ప్రత్యేక పాత్ర చేశారు.

జగపతి బాబు స్పెషల్ క్యారెక్టర్ లోకనిపించగా.. టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ సాంగ్ లో మెరిసారు. సల్మాన్ ఖాన్ ప్రాణ స్నేహితుడు ..బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కూడా గెస్ట్ రోల్ లో అలరించారు. ఈమూవీ రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే.. నెగెటీవ్ టాక్ తెచ్చుకుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker