News

సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న బిగ్‌బాస్‌ బ్యూటీ శోభాశెట్టి. తమ ప్రేమ గురించి తెలియడంతో..!

త్వరలోనే ఈ ప్రేమజంట పెళ్లి చేసుకోబోతున్నారు అని సమాచారం. పెళ్ళికి ముందే వీరిద్దరూ కలిసి ఉండటానికి ఓ ఫ్లాట్ ని కొనుక్కొని దాన్ని వీరికి నచ్చినట్టు డిజైన్ చేయించుకుంటున్నారు. దీనికి ఇద్దరి పేర్లు కలిసేలా యశ్‌శోభా నిలయం అని పేరు పెట్టడం విశేషం. అయితే బిగ్‌బాస్‌ హౌజ్‌లో శోభాశెట్టికి సంబంధించి మరో సీక్రెట్‌ వెల్లడయ్యింది. ఈ షో ద్వారా ఆమె తొలిసారిగా తన ప్రియుడిని పరిచయం చేసింది. అతడిని చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు.

ఎందుకంటే మోనిత లవర్‌ ఎవరో కాదు.. కార్తీక దీపం సీరియల్‌లో డాక్టర్‌ బాబు తమ్ముడిగా నటించిన వ్యక్తే. స్టేజ్‌ మీద అతడిని చూసిన వారు ఆశ్చర్యపోయారు. అరే వీళ్లద్దరి మధ్య లవ్‌ ఎప్పుడు స్టార్ట్‌ అయ్యిందబ్బ అనుకున్నారు అంతా. ఇక మోనిత ప్రేమించిన వ్యక్తి పేరు యశ్వంత్‌ రెడ్డి. కార్తీక దీపం సీరియల్‌ సమయంలోనే వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త.. ప్రేమగా మారింది అంట.

ఇక బిగ్‌బాస్‌ హౌజ్‌ నుంచి బయటకు వచ్చాక.. శోభాశెట్టి, ఆమె లవర్‌ ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ వీడియోలు అప్లోడ్‌ చేస్తుంటారు. తాజాగా వీరిద్దరూ కలిసి సంక్రాంతి పండుగ చేసుకున్నారు. ఈ క్రమంలో తాజాగా అందరికి షాక్‌ ఇచ్చింది శోభాశెట్టి. నిశ్చితార్థం చేసుకున్నట్లు ప్రకటించింది. తన బర్త్‌డే నాడే ప్రియుడు యశ్వంత్‌ రెడ్డిని నిశ్చితార్థం చేసుకుంది శోభాశెట్టి.

ఎంతో సింపుల్‌గా కేవలం కుటుంబ సభ్యుల మధ్యనే ఈ వేడుక జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో శోభాశెట్టి తన యూట్యూబ్‌ చానెల్‌లో పోస్ట్‌ చేసిన వీడియోలో చెప్పుకొచ్చింది. దీనిలో శోభాశట్టి, యశ్వంత్‌ రెడ్డి దండలు మార్చుకుంటున్న ఫొటోలు షేర్‌ చేసింది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker