News

ఎంపీ నందిగం సురేష్ కి తృటిలో తప్పిన ప్రమాదం, షాక్ లో జగన్.

నందిగం సురేష్‌బాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బాపట్ల లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎంపీగా గెలిచాడు. అయితే ఎదురుగా వస్తోన్న కారును గమనించిన ఎంపీ కారు డ్రైవర్‌ అప్రమత్తమై వాహనాన్ని కంట్రోల్‌ చేశారు. లేకపోతే కారు కరకట్ట మీద నుంచి 30 అడుగుల లోతులో ఉన్న పంట పొలాల్లోకి దూసుకుపోయేది అని తెలిపారు బషీర్.

ఎంపీ కారును ఢీకొట్టెందుకు ప్రయత్నించడమే కాక.. ఆ తర్వాత కారులో డ్రైవర్‌ వెనుక కూర్చున్న వ్యక్తి కారు అద్దాలు కిందికి దించి చూపుడువేలుతో వార్నింగ్‌ ఇస్తూ, టీడీపీ సింబల్‌ అయిన విక్టరీ సింబల్‌ చూపిస్తూ నాలుక మడత పెట్టి వార్నింగ్‌ ఇస్తున్నట్లు సైగలు చేశారని చెప్పుకొచ్చారు.

ఆగంతకులు ఉన్న కారులోంచి ఓ వ్యక్తి కిందకు దిగి వేళ్లు చూపిస్తూ ఎంపీ అయితే ఏమిటి.. త్వరలోనే మీ సంగతి చూస్తానంటూ వార్నింగ్‌ ఇచ్చాడని చెప్పుకొచ్చారు. ఆగంతకుల కారుకు అడ్డుగా నిలిచిన బషీర్‌ను ఢీ కొట్టేందుకు ప్రయత్నించారు.

ఎంపీ సురేష్‌ సీటులో కూర్చున్న వ్యక్తిని ఉద్దేశించి.. మీరు ఎవరు.. ఎందుకు ఇలా చేస్తున్నారు అని ప్రశ్నించగా.. నీకు చెప్పేది ఏంట్రా అంటూ కారు ఎక్కుతూ మరోసారి చేతివేళ్లు ఊపుతూ నీ సంగతి తేలుస్తామంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు ఆగంతకులు.

ఆ కారులో డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు ఉన్నారు. ఈ ఘటనపై తుళ్ళూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫిర్యాదు నమోదు చేసి కారు నంబరు ఆధారంగా వారిని పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని సురేష్ పీఎస్వో బషీర్‌ తెలిపారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker