News

ప్రెగ్నెన్సీ గురించి ఎవరూ ఊహించని విషయం చెప్పిన ఉపాసన, షాక్ లో..!

మొదటగా తన ఇంటికి మరో బుజ్జాయి అడుగుపెట్టబోతుందని వార్త చెబితే తర్వాత ఆర్‌ఆర్‌ఆర్‌ ద్వారా అస్కార్‌ అందుకున్నాడు. 2012లో కొణిదెల వారి ఇంటికి కోడలిగా వెల‍్లింది ఉపాసన. దశాబ్దం తర్వాత వారు తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించారు. అటు వ్యాపార పనుల్లో బిజీగా ఉంటూనే ఎప్పుడూ సోషల్‌ మీడియాలో టచ్‌లో ఉంటారు ఉపాసన. ఓ ఇంటర్వ‍్యూలో తన ప్రెగ్నెన్సీ గురించి ఆసక్తికరమైన విషయం తెలిపారు. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

ప్రస్తుతం ఆమె ప్రెగ్నెన్సీ తో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. గర్భవతిగా ఉండి కూడా ఆమె చాలా యాక్టివ్ గా కనిపిస్తూ ఎన్నో పనులలో తన వంతు భాగం పంచుకుంటుంది. ఇకపోతే ఈ మధ్యకాలంలో తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఎన్నో రహస్యాలను కూడా ఓపెన్ గా మాట్లాడుతూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది మెగా కోడలు. ఈ నేపథ్యంలోనే తాజాగా తన డెలివరీ విషయమై సీక్రెట్ రివీల్ చేసింది.

రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉపాసన మాట్లాడుతూ.. పెళ్ళికి ముందు నుంచే రాంచరణ్ తో మంచి స్నేహం ఉందని చెప్పినామే.. పిల్లలను కనే విషయంలో కూడా తాము ఒక క్లారిటీతోనే అడుగులు వేసామని చెప్పుకొచ్చింది. తమ పెళ్లి జరిగిన కొత్తలోనే ఎగ్స్ ఫ్రీజ్ చేశామని ఒక షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది ఉపాసన. ఇకపోతే ఈ విషయంలో తాను, రాంచరణ్ ముందుగానే నిర్ణయం తీసుకొని అదే బాటలో నడిచామని చెప్పుకొచ్చింది.

జీవితంలో సక్సెస్ అయ్యాకే , సరైన సంపాదన ఉన్నప్పుడే పిల్లల్ని కనాలని అప్పుడే డిసైడ్ అయ్యామని.. అందుకే అండాలను దాచి పెట్టాల్సి వచ్చింది అంటూ ఆమె తెలిపింది. ప్రస్తుతం తామిద్దరం లైఫ్ లో సెటిల్ అయ్యామని.. ఉన్నత స్థానానికి చేరుకున్నామని ఇక తమ సంపాదనతో తమ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వగలమనే నమ్మకం తమకు వచ్చిందని..

అందుకే ఇప్పుడు పిల్లలను ప్లాన్ చేసుకున్నామని కూడా ఉపాసన తెలిపింది. ఇకపోతే ఉపాసన చెప్పిన ఈ కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా వీరు భవిష్యత్తుపై చాలా చక్కగా ఆలోచనలు పెట్టుకున్నారని.. అన్ని విధాలుగా ఆలోచించి మరి ముందడుగు వేస్తున్నారని ప్రతి ఒక్కరు మురిసిపోతున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker