ఇంత తొందరగా విడిపోతామని అనుకోలేదు, మొదటిసారి నిజాలు చెప్పిన వంశీకృష్ణ-నేత్రా రెడ్డి.
![](https://www.manaarogyamkosam.com/wp-content/uploads/2024/01/nehtra654546-780x470.jpg)
ఎంత గొప్పగా పెళ్లిళ్లు జరుగుతున్నాయో విడాకులు కూడా అంత తొందరగా నమోదవుతున్నాయి. భార్యాభర్తలు సర్దుకుపోలేకపోవడం ఒక కారణం అయితే భార్యాభర్తల బంధంలో పెద్ద వాళ్లు జోక్యం చేసుకోవడం రెండవది. అయితే విడిపోవడానికి గల కారణాలపై ప్రశ్నించింది. ఈ సందర్భంగా వంశీకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొదటిసారి తమ విడాకులు అంశంపై స్పందించాడు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ.. ‘‘విడాకుల గురించి ఒపెన్గా మాట్లాడకూడదని మేం ముందుగానే అనుకున్నాం. అందుకే విడాకులకు గల కారణాల గురించి నేను ఏం చెప్పలేను.
కానీ వ్యక్తిగతంగా, వృత్తిపరంగా కొన్ని విభేదాలు వచ్చాయి. నవంబర్ వరకు కలిసి ఉన్నాం.. కానీ ఇంతలోనే ఈ ప్రకటన అంటే.. కలిసి ఉన్నప్పుడు మేం సంతోషంగా లేము. ఊపిరాడన్నట్లు అనిపించింది. ఎంత అడ్జస్ట్ అయినా పరిస్థితులు మారలేదు. ఏదో అసంతృప్తి. అందుకే విడిపోయాము’’ అని తెలిపాడు. ‘కలిసి ఉన్న రోజుల్లో మేం ఎంతో సంతోషంగా ఉన్నాము. అసలు విడిపోతామనే ఆలోచన కూడా రాలేదు. ఏడాదిన్నరకు పైగానే.. కేవలం మేమిద్దరం మాత్రమే కలిసి ఉన్నాం.
మేం ఒకరికి ఒకరం ఎక్కువ అలవాటు. మాతోపాటు ఎవరూ లేరు కదా.. ఒకరితో ఒకరం ఉండటం వల్ల మామధ్య ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుండే. మేం బయటకు కూడా ఎక్కువగా వెళ్లకపోయేవాళ్లం. మేం ఇద్దరం కలిసి ఎక్కువ టైమ్ స్పెండ్ చేసే వాళ్లం. మా మధ్య పెద్దగా గొడవలు కూడా జరిగేవి కావు. మరి దిష్టి తగిలిందేమో. అందుకే ఈ పరిస్థితి వచ్చింది. మా పరిస్థితి పూర్తిగా చేయి జారిపోయిన తర్వాతే మేం విడిపోవాలని నిర్ణయించుకున్నాం’’ అని చెప్పుకొచ్చాడు వంశీకృష్ణ.