Stone Fruits : ఈ పండు కనపడగానే తినేయండి, ఎందుకంటే.. కేవలం 25 నిమిషాల్లోనే మీ కడుపు మొత్తం క్లీన్ అవుతుంది.

Stone Fruits : ఈ పండు కనపడగానే తినేయండి, ఎందుకంటే.. కేవలం 25 నిమిషాల్లోనే మీ కడుపు మొత్తం క్లీన్ అవుతుంది.
Stone Fruits : నార్మల్గా చాలా ఫ్రూట్స్లో గింజలు ఉండడం మనకు తెలిసిందే. అయితే.. కొన్నింటిలో పండ్లను కప్పి ఉంచే ఒక చిన్న రాయి లాంటి దృఢమైన నిర్మాణం ఉండి.. దాని చుట్టూ పండు గుజ్జు ఉంటుంది. ఇలాంటి పండ్లనే ‘స్టోన్ ఫ్రూట్స్’ అంటారు. అయితే బరువు తగ్గాలనుకునే వారికి పిచ్ అద్భుతమైన ఎంపిక అంటున్నారు నిపుణులు. పిచ్ పండులో కేలరీలు తక్కువగా ఉండటం కారణంగా బరువు నియంత్రణలో ఉంచుకొవచ్చు అంటున్నారు నిపుణులు. పోషకాలు పుష్కలంగా ఉంది, ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది.
Also Read : పేగులు ఆరోగ్యంగా ఉంటేనే ఈ రోగాలు దూరం.
పేగు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పీచ్ పండులో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఈ పండు కంటి ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. పిచ్ పండులో విటమిన్ ఏ తో పాటు బీటా కెరోటీన్ కూడా పుష్కలంగా ఉండటం వల్ల కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఆరోగ్యకరమైన కంటి చూపును మెరుగుపరిచి ఇది క్యాటరాక్ట్ సమస్యలు రాకుండా నివారిస్తుంది. పీచ్ పండు క్యాన్సర్ కణాలు అభివృద్ధికి వ్యతిరేకంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది.

మోనోపోజ్ మహిళలు రోజుకు కనీసం రెండు పీచు పండ్లు అయినా తినాలని వైద్యులు సూచిస్తున్నారు.. అంతేకాదు పీచ్ పండులో పాలిఫెనల్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది నొప్పి సమస్యలను తగ్గించుతాయి. పీచ్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల అధిక తినాల్సిన కోరిక రాదు. అయితే ఇది జీర్ణ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణ ఆరోగ్యం మెరుగుపడుతుంది.. అంతేకాదు డయేరియా, మలబద్దక సమస్యలను దరిచేరకుండా చేస్తుంది.
Also Read : నల్ల మచ్చలు ఉన్న అరటి పండ్లు తింటున్నారా..?
ఆరోగ్యకరమైన పేగు కదలికలకు తోడ్పడుతుంది. పీచెస్ రక్తపోటును, అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తుంది. రక్తంలో హిస్టమైన్ ఉత్పత్తిని నిరోధించి, అలెర్జీ లక్షణాలను తగ్గిస్తుంది. అంతేకాదు.. పీచ్ పండుతో అందాన్ని కూడా రెట్టింపు చేసుకోవచ్చు. పండులో విటమిన్ ఎ, సి ఎక్కువగా ఉండటం వల్ల ఈ పండుతో ఫేషియల్ చేయడం వల్ల చర్మం ముడతలు తొలగిపోయి, చర్మ రంధ్రాలలోని మలినాలు తొలగిపోయి ముఖం శుభ్రంగా, మెరుస్తూ ఉంటుంది.